logo

అంబేడ్కర్‌ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన గోకవరం మండలం తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది.

Updated : 08 Jun 2023 06:03 IST

గోకవరం, న్యూస్‌టుడే: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన గోకవరం మండలం తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని దుండగులు బుధవారం ధ్వంసం చేశారు. దీంతో అంబేడ్కర్‌ యూత్‌ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. విషయాన్ని మండల, జిల్లా స్థాయి దళిత సంఘాల నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. గతంలోనూ అంబేడ్కర్‌ ఫ్లెక్సీలను, బ్యానర్లను కొందరు ధ్వంసం చేశారన్నారు. జైభీమ్‌ సేన రాష్ట్ర నాయకుడు కురువెళ్ల భానుచందర్‌ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంతా కలిసి గోకవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టి ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాలమహానాడు జిల్లా నాయకుడు చందు, అంబేడ్కర్‌ యూత్‌ సభ్యులు జుత్తుక జయరాజు, వంకర శ్రీను, కన్నాబత్తుల శ్రీను, కుసుమ శ్రీను, తనికెళ్ల కృష్ణ, జుత్తుక అర్జున్‌, బుంగా రాజు తదితరులు పాల్గొన్నారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న యూత్‌ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని