ముంచేస్తున్నా.. ముందు చూపేది?
రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి.
వరద నీటి ముంపులో కొత్త కాకినాడ కూడలి
రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. కాకినాడలోనూ 2021లో ఇదే దుస్థితి పలుచోట్ల చోటు చేసుకుంది. గట్టిగా గంటపాటు వర్షం పడితే రెండు నగరాల్లోనూ పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకుని గంటల తరబడి జనం అవస్థలు పడుతున్నారు. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వరద భయంతో నగరాలు వణికిపోతున్నాయి. ఏటా ముంపు వెంటాడుతున్నా.. పాలకులు, అధికారులు దీని నివారణకు శాశ్వత చర్యల దిశగా దృష్టిసారించడం లేదనే ఆవేదన జనం నోట వినిపిస్తోంది.
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్ నగరంలో శాశ్వత ముంపు నివారణకు చర్యలు చేపట్టడం లేదు. 20 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైతే చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. 17 ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. మేజర్, మైనర్ డ్రెయిన్లలో పూడిక పూర్తిస్థాయిలో తొలగించక చిన్నపాటి వర్షానికే ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. నగరంలో రోజూ 41.64 మిలియన్ లీటర్ల వృథా నీరు డ్రెయిన్లలోకి వెళుతోంది. భవిష్యత్తులో ఇది 52.35 మిలియన్ లీటర్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృథా నీరు సముద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ముంపు చోటుచేసుకుంటోంది.
ఇలాచేస్తే..
కాకినాడ
- నగరంలోని అన్ని డ్రైయిన్ అవుట్లెట్స్ ఉప్పుటేరు కాలువలో కలుస్తున్నాయి. దీని వెంబడి కచేరిపేట, పాతబస్టాండు, ప్రేజరుపేట, వెంకటేశ్వరకాలనీ మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముంపు తప్పించేందుకు ఉప్పుటేరుకు రక్షణ నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలి.
- 14 కి.మీ.మేర విస్తరించిన రైల్వే డ్రైయిన్ కల్వర్టులు వెడల్పు చేయాలి.
- మెయిన్ రోడ్డులో నాలుగు కల్వర్టులను 2002లో పునర్ నిర్మించారు. ఇంకా 12 కల్వర్టులు వెడల్పు చేయాలి.
- రమణయ్యపేట నుంచి ఉప్పుటేరు వరకు ఉన్న పీడబ్ల్యూడీ కాలువను మనుగడలోకి తేవాలి. ఆక్రమణలు తొలగించాలి.
- చీడీలపొర కాలువ ఆక్రమణలు తొలగించాలి.
- మెయిన్రోడ్డు, సినిమారోడ్డులో డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నీరు పారడంలేదు. అలంకరణ కోసం ప్లాట్ఫారాలు కట్టారు. వీటిలో పూడిక తొలగించాలి.
- జగన్నాథపురం బాలయోగి విగ్రహం నుంచి మహాలక్ష్మీ నగర్ మీదుగా మేజర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలి.
ప్రతిపాదన అటకెక్కి..
భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు 15 ఏళ్ల కిందట సర్వే చేశారు. సముద్ర మట్టానికి నగరం దిగువన ఉండటంతో సాధ్యపడదని తేల్చారు. పంపింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించినా వ్యయాన్ని భరించలేమని దాన్ని పక్కన పెట్టారు.
కాలువ నిర్మాణాలు పూర్తికాక...
- ముంపు నివారణకు అమృత్ ఫేజ్-2 నిధులతో తలపెట్టిన కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ల క్రితం మొత్తం 20.36 కి.మీ మేర నిర్మించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టగా ఇప్పటి వరకూ 11.84 కి.మీ మేర మాత్రమే కాలువలు పూర్తయ్యాయి.
- రైల్వే స్టేషన్ నుంచి సాయిబాబా ఆలయం వరకూ నిర్మించాల్సిన 4.2 కి.మీ కాలువ, 532 మీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగారు.
- కాతేరు నుంచి నల్లా ఛానల్ అనుసంధానంగా 2.3 కి.మీ నిర్మించాల్సిన కాలువ నిర్మాణ పనులు ఆసలు ఆరంభించలేదు.
- కోటగుమ్మం నుంచి ఆవ ఛానల్ వరకూ 1.7 కి.మీ కాలువ ఇప్పటి వరకూ 250 మీటర్లు మాత్రమే పనులు జరిగాయి.
ఈ ప్రాంతాల్లో సమస్య
రాజమహేంద్రవరం
- ఛానల్కు ఆనుకొని ఉన్న ఆర్యాపురం, తుమ్మలావ, రామచంద్రరావుపేట, ఆదెమ్మదిబ్బ, జయరామ్, నటరాజ్ థియేటర్, గోకవరం బస్టాండ్ వెనుక వీధులన్నీ నీట మునిగిపోతున్నాయి. నల్లా ఛానల్ వద్ద ఎన్ఆర్సీపీ ప్లాంటు ఉన్నప్పటికీ నీటిని పంపింగ్ చేయడంలో ఆలస్యమవుతుండడమే ఇందుకు కారణం. వర్షాకాలంలో నీటి ఒత్తిడిని తట్టుకునేలా ఆర్యాపురం వద్ద చెరువు ఏర్పాటు చేయగా.. నిర్వహణ లేకపోవడం సమస్యగా మారింది.
- కంబాలచెరువు ఆధునికీకరణకు గత ఏడాది రూ.5 కోట్లతో తలపెట్టిన పనులు పూర్తికావాల్సి ఉంది.
- కోటిపల్లి బస్టాండ్, ఆల్కట్ గార్డెన్స్, రైల్వేస్టేషన్ మీదుగా అమృత్ నిధులు రూ.7 కోట్లతో ప్రధాన కాలువ నిర్మించాలని ప్రతిపాదించినా స్థలం కోసం రైల్వే శాఖకు సుమారు రూ.10 కోట్లు వరకూ చెల్లించాల్సి రావడంతో ఆగిపోయింది.
- నేతాజీనగర్, రామకృష్ణానగర్, చైతన్యనగర్, ఆవ ప్రాంతంలో ముంపు నివారణకు రూ.4 కోట్లతో పంపింగ్ కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదన టెండర్ల దశలోనే నిలిచిపోయింది.
భూగర్భ డ్రైనేజీ అవసరం
ముంపు సమస్య నివారణకు భూగర్భ కాలువ వ్యవస్థ ఏర్పాటు అవసరం. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గతంలోనే దీన్ని సూచించింది. పటిష్ఠమైన కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ఎస్టీపీ ఏర్పాటు చేసి మురుగు నీటిని శుద్ధిచేసి భూగర్భ కాలువల ద్వారా ధవళేశ్వరం తర్వాత నదిలో కలపాలని గతంలోనే ప్రతిపాదించారు. ఇప్పటి వరకూ పాలకులు దీనిపై దృష్టి సారించడం లేదు.
పతంజలి శాస్త్రి, జాతీయ పర్యావరణ శాస్త్రవేత్త
దశలవారీగా చేస్తున్నాం...
నగరంలో ముంపు నివారణలో భాగంగా కాలువల ఆధునికీకరణకు రూ.200 కోట్లు వరకూ ఖర్చవుతుందని అంచనా వేశాం. దశల వారీ పనులు చేస్తున్నాం. ఆల్కట్ గార్డెన్స్, పేపరుమిల్లు రోడ్డు, కోరుకొండ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా కాలువ విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కంబాలచెరువు పార్కు పనులు చివరి దశలో ఉన్నాయి. తుమ్మలావ ప్రాంతాల్లో కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.
దినేష్కుమార్,కమిషనర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్
ఏటా ఆందోళనే
ఏటా ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వరద భయంతో వణికిపోతున్నాం. ఉప్పుటేరుకు సమీపంలో మా నివాసాలున్నాయి. 2021లో వచ్చిన వరదలకు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. పిల్లలకు పాలు తెచ్చుకోడానికి పడవలపై వెళ్లాల్సి వచ్చింది. తిండికి తీవ్ర ఇబ్బంది పడ్డాం. ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలి.
ఓలేటి ధనలక్ష్మి, ప్రేజరుపేట
అన్ని చర్యలు చేపడుతున్నాం..
ముంపు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 44 కి.మీ మేర మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగించాం. 48వ డివిజన్లో రూ.10 లక్షలతో పూడికతీత పనులు పూర్తి చేశాం. మిగతా నిధులకు కలెక్టర్కు నివేదించాం. ఉప్పుటేరు కాలువకు రక్షణ గోడ అంశం పెండింగ్లో ఉంది. స్మార్ట్సిటీలో ప్రతిపాదనలు చేశాం. ముంపుబారిన పడుతున్న 17 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాం.
పి.సత్యకుమారి, పర్యవేక్షక ఇంజనీరు, కాకినాడ కార్పొరేషన్
రాజమహేంద్రవరంలో ప్రధాన రహదారి సమీపంలో ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ