logo

‘జగన్‌ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’

అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్‌ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

Published : 28 Mar 2024 03:13 IST

గోడపత్రికను ఆవిష్కరించిన యనమల, ఉదయ్‌ శ్రీనివాస్‌

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్‌ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జనసేన ఎంపీ కూటమి అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ బుధవారం తేటగుంట గెస్ట్‌హౌస్‌లో యనమలను కలిసి ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు బదిలీపై నాయకులు అవగాహన పెంచుకొని జనసేన, తెదేపా ఓట్లను ఇరువురికి వేసేలా క్షేత్రస్థాయిలో కృషిచేయాలన్నారు. ప్రజాస్వామ్య రక్షణ, రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ఏర్పడిందని, లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తుని ఎమ్మెల్యే అభ్యర్థిని యనమల దివ్య, భాజపా నాయకుడు వెలుగుల శ్రీనివాస్‌, తెదేపా నాయకుడు యినుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని