జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి.
రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నామపత్రాలు చొప్పున దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరూ నామపత్రాలు దాఖలు చేయలేదన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున దగ్గుబాటి పురందేశ్వరి నామపత్రాలను సమర్పించగా అనపర్తిలో తెదేపా తరఫున నల్లమిల్లి మహాలక్ష్మి, రాజానగరంలో వైకాపా తరఫున జక్కంపూడి రాజా ఇంద్రవందిత్, గంధం రాజశ్రీ, రాజమహేంద్రవరం గ్రామీణలో తెదేపా తరపున గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కొవ్వూరులో తెదేపా తరపున ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున అరిగెల అరుణకుమారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున బొంతా శ్యామ్రవిప్రకాష్, నిడదవోలులో జనసేన తరఫున కందుల లక్ష్మీదుర్గేష్ప్రసాద్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ(ఎ.ఐ.ఎఫ్.బి.) తరపున కస్తూరి సత్యప్రసాద్, గోపాలపురంలో వైకాపా తరపున తానేటి వనిత, జొన్నకూటి బాబాజీరావు నామపత్రాలు దాఖలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
కోడ్కు దొరకకుండా కొత్త ఎత్తులు
ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థి నామినేషన్ ఘట్టం తీరు
ప్రత్తిపాడు: ఎన్నికల నిబంధనలను ఎన్నున్నా.. పక్కదారులు, ప్రత్యామ్నాయాలు ఎన్నో‘కళలు’గా ప్రత్యక్షమవుతుంటాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో శుక్రవారం జరిగిన వైకాపా అభ్యర్థి వరుపుల సుబ్బారావు నామినేషన్ ఘట్టం ఇందుకొక ఉదాహరణగా నిలుస్తుంది. ఒక వంక ‘సిద్ధం’ సభకు జన సమీకరణ.. మరో వైపు నామినేషన్ వెరసి పెద్ద ఎత్తున హంగామానే చోటు చేసుకుంది. తరలించిన జనానికి హైవే సమీపంలో ఏర్పాటైన ఓ పుట్టిన రోజు వేడుకలో భాగం చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరు ఎవరో ఎవరికెరుక. అదలావుంచి.. మందికి ‘మందే’ ముందు.. అది సహజంగానే చిందులేయించింది. వైకాపా అభ్యర్థి వరుపుల నామినేషన్ వేసేందుకు తన కుమారుడు సూరిబాబు, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబులను వెంట పెట్టుకుని ఒక సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్లు స్వీకరణ కేంద్రానికి సమీపంలోని రహదారిపైనే వైకాపా శ్రేణుల కోలాహలం అది నామినేషన్దా..? సిద్ధం జనసమీకరణదా..? లేకుంటే అదంతా ఓ ప్రయివేటు పుట్టినరోజు..? వేడుకదా అనేది ఎన్నికల వ్యయ పరిశీలకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నేగా..!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
[ 02-05-2024]
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ప్రశాంతంగా హోం ఓటింగ్
[ 02-05-2024]
మండలంలో హోం ఓటింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. రెండు బృందాల పర్యవేక్షణలో అధికారులు ఇంటింటికి వెళ్లి జాబితాలో నమోదైన ఓటర్లు ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. -
తాళ్లపూడిలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
[ 02-05-2024]
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
ఇసుక తోడేళ్లు..
[ 02-05-2024]
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. -
వైకాపా కోటలు బద్దలు కొడదాం
[ 02-05-2024]
మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా అరాచక పాలనపై ధ్వజమెత్తారు. కూటమి అభ్యర్థుల విజయం ద్వారా దీనికి చరమగీతం పాడవచ్చన్నారు. -
బాబ్బాబు.. పార్టీ మారొద్దు..
[ 02-05-2024]
నిడదవోలు వైకాపా నేతలు వరుసగా రాజీనామాలు చేసి జనసేన, తెదేపాల బాట పడుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉన్నవారు చేజారిపోకుండా నియోజకవర్గ నాయకుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
‘రౌడీ రాజ్యాన్ని ఓటుతో తరిమికొట్టండి’
[ 02-05-2024]
ఓటుతో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీయే కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్చచౌదరి పిలుపునిచ్చారు. -
టీకాలకూ ఠికానా లేదు..!
[ 02-05-2024]
వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని.. అందరికీ మెరుగైన సేవలందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
నువ్వూ వద్దు.. నీ పనులూ వద్దు..
[ 02-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి వాగ్ధానాలు చేశారు. ప్రజలు నిజమేనని నమ్మి ఓటేశారు.. తీరా పీఠమెక్కిన తర్వాత బటన్ నొక్కడం తప్ప రోడ్లు బాగుచేయడం వంటి కీలక అంశాలు మరిచారు. -
భిక్షనుకున్నారా?.. కక్షగట్టారా..?
[ 02-05-2024]
నిరుపేద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకు లింకేజీ, పూర్తి రాయితీ రుణాలను అందించేవారు. కిరణా దుకాణాలు, టెంటు హౌస్లు, ఆటోలు, కార్లు, వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలు స్వయం ఉపాధి బాటపట్టేవారు. -
రాజకీయాల్లో నేర చరితులను అడ్డుకోవాలి
[ 02-05-2024]
నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో జిల్లా అభ్యదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ఎన్నికల భారతం’ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా..?
[ 02-05-2024]
హోం మంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు లేవని, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ఎక్కువయ్యాయని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. -
భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 200 స్థానాల్లో కూడా గెలవడం కష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. -
ఎంపీ గుట్టు బయటపెడతాం: ఆదిరెడ్డి
[ 02-05-2024]
యువతను జగన్ మోసం చేశారని కూటమి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చర్చిలో వైకాపా నేతల ప్రచారం
[ 02-05-2024]
కాకినాడ గ్రామీణం రాయుడుపాలెం సీటీసీ చర్చిలో బుధవారం వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం