logo

కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి

రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజవర్గం కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.

Published : 23 Apr 2024 04:56 IST

దేవీచౌక్‌: రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజవర్గం కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఈ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ  పోలవరం, ప్రత్యేక హోదా కోసం రుద్రరాజు గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని, రాజమహేంద్రవరానికి సరైన అభ్యర్థని కొనియాడారు. రుద్రరాజు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హోదా వస్తుందన్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో ఏపీలో కూడా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఎన్నికల పరిశీలకుడు మనోజ్‌చౌహాన్‌, తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చల్లా నరసింహారెడ్డి, సినీహీరో రాజా, రాజమహేంద్రవరం సిటీ, గ్రామీణ నియోజకవర్గాల అభ్యర్థులు బోడ వెంకట్‌, బాలేపల్లి మురళీధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని