ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ సూర్యనారాయణ
మాట్లాడుతున్న ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉందని అంచనా ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 1న జీతాలు చెల్లించినా వాస్తవానికి సక్రమంగా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు 1వ తేదీకి ముందురోజే జీతాలు రావడానికి కారణం వారికి చట్టబద్ధత ఉండటమేనన్నారు. ఉద్యోగులకు కూడా అలాంటి చట్టబద్ధత అవసరమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్కార్డు ఎందుకూ పనికిరావడం లేదన్నారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1500 కోట్లు జమ చేయకపోవడంతో సేవలు అందించలేమని ఇటీవలే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశార]న్నారు. కానీ ప్రతినెల ఉద్యోగుల జీతంలో వైద్యసేవల నిమిత్తం సొమ్ము సేకరిస్తున్నారన్నారు. 12వ పీఆర్సీ సత్వరం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సర్వీసురూల్స్ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఇంకా పాలక మండలి ఎందుకని ప్రశ్నించారు. వీరికి ఏ పెన్షన్ అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై ఓటింగ్ విధానం అమలు చేయాలన్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ చేపట్టాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కొంతమందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, దీంతో వారు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయలేదన్నారు. ఎన్నికల కమిషన్ కలుగజేసుకొని తక్షణం వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. నవ్యాంధ్ర ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు కరణం హరికృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. అదనపు పనిభారం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ బాజీపఠాన్, ఉపాధ్యక్షులు పాపారావు, రవీంద్రబాబు, రమేష్బాబు, నరసింహారావు, మాగంటి శ్రీనివాసరావు, గరికపాటి సురేష్, దినేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో