జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు.
అయిదేళ్లుగా విజ్ఞాన యాత్రలు లేవ్..
ఒక్క పైసా కూడా విదల్చని ప్రభుత్వం
న్యూస్టుడే, ముమ్మిడివరం
ముమ్మిడివరంలో విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. చదువుకునే పాఠశాలకు సమీపంలో ఉండే పర్యాటక ప్రదేశాలు, ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా.. కొత్త విషయాలను తెలుసుకోవడం.. వారిలో కొత్త ఆలోచనలు వచ్చి వినూత్న ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉండేది. వైకాపా పాలన వచ్చిన తర్వాత విజ్ఞాన యాత్రలకు మంగళం పాడేశారు.
నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించి వాటి రూపురేఖలు మార్చేశాం.విద్యార్థులకు ట్యాబ్లు, డిజిటల్ బోధన, టోఫెల్ పరీక్షలు, బైజూస్ కంటెంట్తో పాఠాలు.. ఇలా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సామర్ధ్యం పెంచడానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం.
ఇవి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో చెప్పే ఊకదంపుడు ఉపన్యాసంలోని సారాంశం.
విద్యార్థుల సామర్ధ్యాలు.. వారి వ్యక్తిత్వ వికాసానికి విజ్ఞాన యాత్రలు ఎంతగానో దోహదపడతాయని ముఖ్యమంత్రికి తెలియదా..? వైకాపా పాలన వచ్చిన తర్వాత విజ్ఞాన యాత్రల నిర్వహణకు ఇవ్వాల్సిన గ్రాంట్లకు జగన్మామ పూర్తిగా మంగళం పాడేశారు.
పాఠశాల నిర్వహణ నిధులనే ఇవ్వడం లేదు..
పాఠశాల నిర్వహణకు ఇవ్వాల్సిన నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. కనీసం సుద్ధముక్క కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. చాలా వాటికి ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పరీక్షల ప్రశ్నాపత్రాలను కూడా వాట్సాప్లో పెట్టి బోర్డుపై రాసి పిల్లలను రాసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే విజ్ఞాన యాత్రలకు డబ్బులు ఇస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.
ఓ ప్రధానోపాధ్యాయుడి ఆవేదన
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 9,10 తరగతులు చదివే విద్యార్థులు సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారిని విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లడానికి ఏటా రూ.కోటి గ్రాంటు సరిపోతుంది. ఈ కొద్దిపాటి నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం.. ఐదేళ్లుగా యాత్రలను నిలిపివేయడం చూస్తే.. జగన్కు సర్కారీ బడుల్లో విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. గతంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) ఉండేది. ఆర్ఎంఎస్ఏ గ్రాంట్లు విడుదలయ్యేవి. ఏటా కార్తిక మాసం రాగానే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లే వారు. జగనన్న ఏలు‘బడి’లో విద్యార్థులకు ఆ యోగం లేకుండా పోయింది.
విజ్ఞాన యాత్రల ద్వారా ఎన్నో విషయాలు
గతంలో ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు కొంత విద్యార్థులు వేసుకుని విజ్ఞాన యాత్రలకు వెళ్లేవారు. కొత్త ప్రాంతాలు సందర్శించి అక్కడ విద్యా విషయక, వైజ్ఞానిక అంశాలు తెలుసుకునేవారు. ఈ యాత్రల వల్ల విద్యార్థులు వినూత్న ప్రయోగాలు, ఆలోచనలకు అవకాశం ఉంటుందని.. ఇవి లేకపోవడంతో అభ్యసనా సామర్ధ్యాలు కుంటుపడు తున్నాయని ఉపాధ్యాయులే చెబుతున్నారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి బోధన చేయడంతో పాటు.. నేరుగా కొత్త అంశాలను చూపిస్తే త్వరగా అర్థం చేసుకుంటారంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు