logo

తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు

తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్‌లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

Published : 04 May 2024 05:04 IST

కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో రోడ్‌షో..
సంతచెరువు కూడలిలో బహిరంగ సభ
ఈనాడు, కాకినాడ

తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్‌లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 6.15 నుంచి 6.25 గంటల వరకు ముఖ్య నాయకులతో మాట్లాడతారు. ఇదే క్రమంలో తెదేపాలో పలువురి చేరికలు ఉంటాయి. అనంతరం కరప మండలం నడకుదురు గ్రామంలోని కుసుమ సత్య ఫంక్షన్‌హాలు వద్దకు వెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు రోడ్‌షో ప్రారంభమై 7.15 గంటలకు కాకినాడలోని అన్నమ్మఘాటి వద్దకు చేరుకుంటుంది.. జగన్నాయక్‌పూర్‌ వంతెన మీదుగా రాత్రి 8 గంటలకు కాకినాడ నగరంలోని సంతచెరువు కూడలి వద్దకు చేరుతారు. పార్టీలో చేరికల అనంతరం రాత్రి 9 గంటల వరకు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రి 9.30 గంటలకు సామర్లకోట మండలం ఏడీబీ రోడ్డులోని కొప్పవరం కూడలికి చేరుకుని బస చేస్తారు. ఆదివారం ఉదయం సామర్లకోట మండలం ఉండూరు సమీప జ్యూయల్‌ సిటీ నుంచి బయల్దేరి వెళ్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని