logo

గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు

రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్‌లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 04 May 2024 04:52 IST

చర్చనీయాంశమైన రౌడీషీటర్‌ వ్యవహారం

గోరంట్లతో వాగ్వాదానికి దిగిన వైకాపా కార్యకర్తలు

టి.నగర్‌, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్‌లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపాకి చెందిన స్థానిక రౌడీషీటరు కొంతమంది మహిళలను తీసుకొని వచ్చారు. గోరంట్ల ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్న సమయంలో ఓ మహిళ తిరగబడింది. తమ వీధిలో ఎలా ప్రచారం చేస్తారంటూ అసభ్య పదజాలంతో నిలదీసింది. అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు గోరంట్లతో వాగ్వాదానికి దిగారు. దీనిపై తెలుగు మహిళలు రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సదరు రౌడీషీటరు తెదేపాలో చేరేందుకు కోరగా, అలాంటి వారికి చోటులేదంటూ ఇటీవల గోరంట్ల తోసిపుచ్చడంతో ప్రస్తుతం కావాలని ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పలువురు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని