జనం భూముల్లో.. జగన్ బూచోడు
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది.
వైఎస్సార్ జగనన్న భూరక్ష (భూముల రీసర్వే..)
ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023
ఈనాడు, కాకినాడ
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. ఇది భూ రక్షణ చట్టం కాదని.. భూ భక్షణ చట్టమని.. దీన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్కులు ప్రజల భూములను దోచేసే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెప్పిన మాట
భూ వివాదాలు లేకుండా.. లావాదేవీలు సులభతరంగా జరిగేందుకు.. రీసర్వే ద్వారా రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు అందిస్తున్నాం.. వీటి ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదో మహా యజ్ఞం.’
2022 డిసెంబర్ 26న ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్
జరిగిన మోసం
దశాబ్దాలుగా సాగుచేస్తున్న భూమి కొలతలు రీసర్వేతో తగ్గించి చూపారని రైతులు, యజమానులు వాపోతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులు రెండు సెంట్ల భూమి నుంచి 10 సెంట్ల భూమి వరకు కోల్పోయారు. ఎందుకు తగ్గిందో రెవెన్యూ అధికారులు చెప్పడం లేదు. కొన్నిచోట్ల రైతులకు తెలియకుండానే భూముల రీసర్వే పూర్తిచేశారు.
- గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామానికి చెందిన నూకాలమ్మ పేరిట 3.34 ఎకరాల భూమి ఉంటే.. భూముల రీసర్వే అనంతరం కొత్తగా ఇచ్చిన పాసుపుస్తకంలో 19 సెంట్లు తగ్గించి చూపారు.
- పి.గన్నవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన వెంకటరమణమూర్తికి 30 సెంట్ల భూమి ఉంది. దశాబ్దానికి పైగా సాగుచేస్తున్న ఈ భూమిలో రీసర్వే అనంతరం 10 సెంట్లు కోత పెట్టారు.
చెప్పిన మాట
మీ భూములపై మీకు సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఉద్దేశం. భూములు సబ్ డివిజన్ లేక అమ్మడానికి, కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలని రీసర్వే ప్రతి గ్రామంలో చేయిస్తున్నాం. ఇది గొప్ప కార్యక్రమం.
తాజాగా పాయకరావుపేట సభలో సీఎం జగన్
జరిగే మోసం
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్- 2023ను గతేడాది అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ వైకాపా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ చట్టంతో భూ యజమానులు, కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. భూ వివాదాల పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా యజమాని స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరించేలా నిబంధనలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొనుగోలు సమయంలో జరిగే అవకతవకలను ఇక నుంచి ట్రైబ్యునల్లో ప్రభుత్వం నియమించే టీఆర్వో పరిష్కరిస్తారని చెప్పడంతో అసలు సమస్య మొదలయ్యింది. భూముల రీసర్వే పూర్తయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వైకాపా నాయకులు భూ హక్కులను హరిస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ముంచుకొస్తున్న ముప్పు..
ల్యాండ్ టైటిల్ యాక్టు అమల్లోకి తెచ్చే క్రమంలోనే ప్రస్తుతం భూముల రీసర్వే వైకాపా ప్రభుత్వం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1,685 గ్రామాల్లో 2.70 లక్షల ఎకరాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. గతేడాది జనవరి మాసాంతానికి రీసర్వే క్రమంలో 3,700 పైచిలుకు అభ్యంతరాలు అధికారుల దృష్టికి వచ్చాయి. సమస్యకు పరిష్కారం చూపాలని కోరితే.. బెదిరింపులే మిగులుతున్నాయి.
ఆందోళన ఎందుకంటే..
భూ సర్వే పూర్తయితే టైటిలింగ్ చట్టాన్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కిస్తారు. కొత్త చట్టం అడ్డంపెట్టుకుని వైకాపా నాయకులు భూ యజమానుల పేర్లు మార్చేస్తారనే ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది.
- ఈ యాక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న 47 సివిల్ కోర్టుల్లో దావాల దాఖలుకు వీలుండదు.
- టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో), ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అధికారి (ఎల్టీవో)లను నియమిస్తారు. ఈ చట్టంతో సివిల్ కోర్టులో దాఖలు చేయాల్సిన వివాదాలు.. ఇక నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే ట్రైబ్యునల్లో చేసుకోవాలి.
- మూడు జిల్లాల్లోని భూ వివాదాలను పరిష్కరించాల్సిన న్యాయకోవిదులను పక్కన పెట్టేసి జిల్లాకో ట్రైబ్యునల్ను అందుబాటులోకి తెస్తారు. న్యాయస్థానాలు చేయాల్సిన పని మూడు ట్రైబ్యునళ్లు పరిష్కరించడం సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్న ఎదురవుతోంది.
- ఇన్నాళ్లూ రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలని స్పందన, ఇతర కార్యక్రమాల్లో విన్నవిస్తున్నా ఆశించిన స్పందన లేదు. అలాంటిది అధికారులకే భూములకు సంబంధించిన శాశ్వత హక్కులు కల్పించే బాధ్యత అప్పగిస్తే చిక్కులు తప్పవన్న భయం పలువురిని వెంటాడుతోంది.
- కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని దస్త్రాలనే రెవెన్యూ సిబ్బంది దన్నుతో దిద్దుబాటు చర్యలకు తెగబడిన అంశం గతంలో దుమారం రేపింది. మూడు జిల్లాల్లోనూ భూముల యాజమాన్య హక్కులు రెవెన్యూ సిబ్బంది దన్నుతో తారుమారు చేసిన ఘటనలు ఉన్నాయి. కొత్త చట్టంతో మరిన్ని చిక్కులు వస్తాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు
భూ యాజమాన్య హక్కు చట్టం-2023తో రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరవయ్యింది. ఒరిజనల్ పత్రాలు తమ దగ్గర పెట్టుకుని జిరాక్స్ పత్రాలు ఇస్తామనడం దురాలోచన. న్యాయ వ్యవస్థను ఈ చట్టం ద్వారా అడ్డుతొలగించుకోవాలని చూస్తున్న జగన్ ప్రభుత్వ కుట్రను.. భగ్నం చేయడానికి న్యాయపోరాటం చేస్తున్నాం.
ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM