అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది.
ఇంటింటికీ వెళ్లకుండా ఓటర్లను సచివాలయాలకు రప్పిస్తున్న వైనం
ఇదీ జిల్లాలో కొందరు బీఎల్వో తీరు
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం)
శుక్రవారం ఉదయం 11.55 గంటల సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని
గ్రామ సచివాలయంలో ఓటరు సిప్పుల కోసం నిరీక్షిస్తున్న ఓటర్లు
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని 1,577 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు కలిగి ఉన్నారనే నిర్ధారణకు, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలియజేసేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్లిప్పులను జారీచేశారు. వీటిని బీఎల్వోలు ఆయా కేంద్రాల పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందజేసి సంతకాలు తీసుకోవాలి. ఈ మేరకు ఆర్వోలు ఇటీవల నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గత నెల 30న కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సైతం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఓటు హక్కు ఉందనే నిర్ధారణ, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలియజేయడమే సిప్పుల పంపిణీ ముఖ్య ఉద్దేశమని, ఈ నెల 13న ఓటు వేసేందుకు సంబంధిత కేంద్రానికి వచ్చేటప్పుడు ఎపిక్కార్డు లేదా ఎన్నికల కమిషన్ గుర్తించిన ఏదైనా ఫొటో ఆధారిత గుర్తింపుకార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలనే విషయాన్ని ఓటర్లకు వివరించాలని సూచించారు.
గతంలోనూ అంతే..
జిల్లాలో కొందరు బీఎల్వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండా స్లిప్పులు ఇచ్చేందుకు వారినే సచివాలయాలకు రప్పిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఓటర్ల జాబితా ధ్రువీకరణ(వెరిఫికేషన్) విషయంలోనూ క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండానే మమ అన్పించడం వల్లే జనవరిలో ప్రచురించి విడుదల చేసిన తుది జాబితాలో అనేక తప్పులు బయటపడటానికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓటు నమోదుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలన, ధ్రువీకరణ లేకుండానే చాలామంది దరఖాస్తులు తిరస్కరణ(రిజెక్టు) చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఓటర్లు స్లిప్పుల పంపిణీ విషయంలోనూ ఇంటింటికీ వెళ్లకుండా కొందరు బీఎల్వోలు ఓటర్లను సచివాలయాలకు రప్పించడంతో సచివాలయాల వద్ద వరుసలో నిలబడాల్సి వస్తుందని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.