చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది.
జగన్ పాలనలో వలస కార్మికుల పిల్లలకు వసతి, విద్య దూరం
న్యూస్టుడే, కాకినాడ నగరం
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. గత ప్రభుత్వాలు కొనసాగించిన వీటిని వైకాపా అధికారంలోకి వచ్చిక నిలిపివేసింది. దీంతో చాలా మంది పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మెట్ట, సముద్ర తీర ప్రాంతాలలో సీజనల్ వసతి గృహాలను గతంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి కోటనందూరు, తుని, రౌతులపూడి, జగ్గంపేట తదితర మెట్ట ప్రాంతాలకు చెందిన కూలీలు పనుల కోసం ఎక్కువగా హైదరాబాద్, విశాఖపట్నం, భీమవరం, వంటి ప్రాంతాలకు వలస వెళ్తారు. కాకినాడ అర్బన్, కరప, యు.కొత్తపల్లి, ఉప్పాడ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఒడిశా, కోల్కతా తదితర దూర ప్రాంతాలకు వేటకు వెళ్తారు. దీంతో వారి పిల్లలు బడికి దూరం కాకుండా ఏటా సమగ్ర శిక్ష తరఫున సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో ఏర్పాటు చేసేవి డీఆర్డీఏ పీడీ, పట్టణాల పరిధిలోవి మెప్మా పీడీ పర్యవేక్షణలో ఉంటాయి. వీటి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తారు. వసతి గృహాల్లో పిల్లలకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలి. మధ్యాహ్న పాఠశాలలోనే భోజనం చేస్తారు. రాత్రి వసతి గృహంలో భోజనాన్ని పెడతారు. సెలవు దినాల్లో మధ్యాహ్నం వసతి గృహాల్లోనే వడ్డిస్తారు. సబ్బు, నూనె, వంటి కాస్మొటిక్స్ అందజేస్తారు. తల్లిదండ్రులు పనులు ముగించుకుని వచ్చే సమయం 3 నుంచి 6 నెలల వ్యవధి వరకు ఈ సీజనల్ వసతి గృహాలను నిర్వహించాలి. వైకాపా అధికారంలో వచ్చాక ఈ సీజనల్ వసతి గృహాల నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొంది. క్రమేణా ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొంది.
ఇదీ లక్ష్యం..
కొన్ని ప్రాంతాల్లో కార్మికులు జీవనోపాధి కోసం కాలానుగుణంగా దూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో పిల్లలను తమ వెంట తీసుకుపోతుంటారు. దీంతో వారు చదువుకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేసి వలస కార్మికుల పిల్లలకు భోజనం పెట్టి బడికి పంపించేవారు. తల్లిదండ్రులు రాగానే వారికి అప్పగించేవారు. ఇలా ఏర్పాటు చేసిన సీజనల్ వసతి గృహాలు వలస కార్మికులకు ఎంతగానే ఉపయోగపడేవి. మత్స్యకారులు కొందరు దూర ప్రాంతాలకు వేటకు వెళ్తుంటారు. ఆ సమయంలో వారి పిల్లలు సరిగా బడికి వెళ్లరు. అలాంటి వారిని గుర్తించి సీజనల్ వసతి గృహాల్లో చేర్పించేవారు.
జిల్లాలో పరిస్థితి..
- 2020-21లో కాకినాడ, తుని, రౌతులపూడి మండలాల్లో ఏడు చోట్ల ఈ సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేశారు. 336 మంది పిల్లలకు వసతి కల్పించారు.
- 2021-22లో రౌతలపూడి, తునిలో కేవలం రెండు చోట్ల మాత్రమే వసతి గృహాలు ఏర్పాటు చేశారు. 99 మంది పిల్లలకు మాత్రమే వసతి కల్పించారు.
- 2022-23లో వసతి గృహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. గత బకాయిలు రాకపోవడంతో ఒక్క చోటా వసతి గృహాన్ని ఏర్పాటు చేయలేదు.
- 2023-24లో వసతి గృహాల ఏర్పాటుకు ప్రతిపాదనలే పంపలేదు. దీంతో ఈ రెండేళ్లు ఆయా ప్రాంతాలలో పిల్లలు అటు చదువులకు..భోజనానికి దూరమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM