వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అవ్వా తాతలను ఎండల్లో ఏడిపించిన సీఎం
పింఛను కోసం రెండోరోజూ తప్పని అష్టకష్టాలు
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే బృందం
కొవ్వూరు: బ్యాంకులో సొమ్ము పడలేదంటూ సచివాలయ కార్యదర్శిని ప్రశ్నిస్తున్న పింఛనుదారులు
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శరీరం సహకరించకపోయినా.. శక్తినంతా కూడగట్టుకుని వచ్చారు. 40 డిగ్రీలు దాటిన ఎండలో బారులు తీరారు.. నీరసించి కొందరు అక్కడే కూర్చుండిపోతే.. పింఛను అందించడానికి పెడుతున్న కొర్రీలు చూసి ఈసురోమన్నారు.. దుష్ట రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్కు ఇది తగదంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.
ధవళేశ్వరం యూనియన్ బ్యాంకు వద్ద ఉదయం8 గంటలకే బారులుతీరిన వృద్ధులు
అవ్వాతాతలపై ఎందుకంత కక్ష..
సీతానగరం: మనుమరాలి సాయంతో వచ్చిన వృద్ధుడు
కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇతర అభాగ్యులు గత రెండు రోజులుగా పింఛన్లు పొందడానికి నానా అవస్థలు పడ్డారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీచేసే సులువైన అవకాశం ఉన్నా.. అలా చేయలేదు.. దూరంగా ఉన్న బ్యాంకుల దగ్గరకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించేలా చేసి నరకం చూపించారు. పింఛను పంపిణీలో కుట్రకు తెరలేపిన జగన్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఆ తప్పు ప్రతిపక్షాలపై తోసేయడానికి ఆపసోపాలు పడుతూ విష ప్రచారం చేస్తోందన్న విషయాన్ని లబ్ధిదారులు గ్రహించారు. బ్యాంకుల వద్ద తమ ఆగ్రహాన్ని వెల్లడించారు. కాట్రేనికోన మండలమే తీసుకుంటే కాట్రేనికోన, పల్లంకుర్రు, కందికుప్ప ప్రాంతాల్లోని బ్యాంకుల వద్దకు పింఛనుదారులు శుక్రవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనేకమందికి ఏ బ్యాంకులో నగదు జమయిందో తెలియలేదు. విత్డ్రా పత్రం రాయించడమే పెద్ద ప్రహసనంగా మారింది.
ముంబై శాఖాలో సొమ్ము జమ
కొవ్వూరు పట్టణం: కొన్నేళ్ల క్రితం ముంబైలో ఉండేవాళ్లం. అక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాతా తెరిచాం. ఆ తర్వాత కొవ్వూరు వచ్చేశాం. ముంబైలోని ఖాతాకు నగదు జమ చేశారు. ఆ ఖాతా, ఆ సంఖ్య నా వద్ద లేవు. యూనియన్ బ్యాంకులో ఖాతా మనుగడలో ఉన్నా ఎప్పుడో ఆపేసిన ఆ ఖాతాలో వేశారు. ఆ సొమ్ములు ఇక రావంటున్నారు.
మట్టా రత్నకుమారి, ఔరంగాబాదు
జగన్ ఓట్ల రాజకీయం
సీతానగరం: ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చిదంటే నిరుపేద కుటుంబాలు టీ తాగేందుకు కూడా డబ్బులు ఉండవు. ఓట్ల కోసం జగన్ చేసే రాజకీయ కుట్రను అర్థం చేసుకున్నాం. ఉద్యోగులు అరగంటలో ఇచ్చేయగలరు. వైకాపాకు ఓటుతో గుణపాఠం చెబుతాం.
శ్రీరమ్ మరియమ్మ, సీతానగరం
ప్రభుత్వ తీరు సరికాదు..
ఇన్నీసుపేట ఎస్బీఐలో ఖాతా ఉంది. అనారోగ్యమైనా సరే మండుటెండలో బ్యాంకుకు వచ్చాను. ఖాతాలో కొన్నేళ్లుగా కనీస నిల్వ లేకపోవడంతో సేవా రుసుము కింద కొంతసొమ్ము మినహాయించుకున్నారు. నాకు పింఛను సొమ్ములే జీవనాధారం. బ్యాంకు ఖాతా రుసుము, ఆటో ఖర్చులతో సగం పోయినట్టే. ప్రభుత్వానికి ఈ పద్ధతి సరికాదు.
ముత్యాలదేవి, రాజమహేంద్రవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్