ప్రగల్భాలే.. పైసా విదల్చలే..
అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి.
అర్ధాంతరంగా ఆగిన ఏలేరు ఆధునికీకరణ
గెద్దనాపల్లిలో నిర్మించిన రెగ్యులేటరు
కిర్లంపూడి, న్యూస్టుడే: అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి. ఎన్నికల ముందు పాదయాత్రలోను, ముఖ్యమంత్రి అయిన తరువాత ఏలేరు ఆయకట్టు పరిధిలోని ప్రాంతాల్లో ఆధునికీకరణపై జగన్ చేసిన ప్రకటనలు ప్రగల్భాలుగానే మిగిలాయి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి నిధులను కూడా విదల్చలేదు. రూ.137 కోట్లతో చేపట్టిన తొలి దశ పనులలో సుమారు యాబై శాతం వరకు పూర్తయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులలో ఏలేరు పేరు లేకుండా చేశారు. దీంతో గతంలో చేసిన పనులకు ఈ ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను వదిలేసి వెళ్లారు. దీంతో ఏలేరు వరదలకు ఆధారిత ఆయకట్టు 67 వేల ఎకరాల్లో రైతులు కోట్లలో పంట నష్టాలను చవిచూశారు. పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులకు బీమా సొమ్ము రాలేదు.
రూ.137 కోట్లతో చేపట్టిన పనుల పరిస్థితి ఇది...
ఏలేరు ఆధునికీకరణలో తొలిదశ పనులను రూ.137 కోట్లతో చేపట్టారు. ఈపనుల్లో కాలువల విస్తరణకు 360 ఎకరాల భూసేకరణ అవసరమైంది. గత ప్రభుత్వంలో 130 ఎకరాలు భూసేకరణచేసి రైతులకు డబ్బులు చెల్లించారు. ఇంకా 230 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా వాటికి రూ.72 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కాలువల విస్తరణ పనులు నిలిచిపోయాయి. అప్పటికే రూ.60 కోట్లతో సాగునీటి నిర్మాణాలు, కాలువల విస్తరణ కోసం భూసేకరణకు రూ.30కోట్లు, ఇతర అవసరాలకు మరో రూ.పది కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణాల పనులు 80 శాతం వరకు పూర్తి కాగా కాలువల విస్తరణ పనులు కేవలం పది శాతం మాత్రమే పూర్తయ్యాయి.
రెండో దశ ఊసేలేదు
ఏలేరు వరదల వల్ల తరచూ ముంపునకు గురయ్యే గొల్లప్రోలు ప్రాంతంలో సీఎం హోదాలో వచ్చిన జగన్ ఏలేరు ఆధునికీకరణ రెండో దశ పనులతో కలిసి రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు 2022లో గొప్పగా ప్రకటించారు. ఇది జరిగి రెండేళ్లు అయినా ఒక్కరూపాయి కూడా మంజూరు చేయలేదు. సుద్దగడ్డ వాగు, ఏలేరు వరదలు వల్ల కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని ఊర్లు, ఏరులు ఒక్కటై జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈసమస్యకు పరిష్కారంలో భాగంగా మొదటి, రెండో దశ పనులకు రూ.474 కోట్ల అవసరమని అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు. రెండో దశ పనులకు, కాలువల విస్తరణకు 265 ఎకరాలు భూసేకరణ చేయాల్సిఉంది. దీనికి రూ. 121 కోట్లు అవసరం.
ఏటా వరదలతో రూ.కోట్లు రైతులు పణంగా పెడుతున్నారు
ఏలేరు ప్రాజెక్టు 24 టిఎంసీల నీటిని నిల్వచేయగల సామర్థ్యం ఉంది. ఆపైన ఏ స్థాయిలో నీరు వచ్చిన వరద నీరుగా కిందికి వదలాల్సిందే. ప్రాజెక్టుకు వరదకాలువ అంటూ ప్రత్యేకంగా ఏదీలేదు. పైగా ఆధారిత ఆయకట్టులో 72 కాలువలు ఓపెన్ హెడ్ ఛానల్స్గానే ఉన్నాయి. దీనివల్ల వరదనీరు నేరుగా పంటలను ముంచెత్తుంది. 2019 ఆగస్ట్టులో ఏలేరు భారీవరదలు కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆసమయంలో జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 42 వేల ఎకరాల్లో వరి, మరో 25 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆసమయంలో రైతులు సుమారుగా రూ.వందకోట్ల విలువైన పంటలను పణంగా పెట్టారు. తరువాత 2020, 2021, 2022 సంవత్సరాల్లోను ఏలేరు వరదలు కారణంగా రైతులు పంటలను కోల్పోయారు. ఈనాలుగేళ్ళలలో సుమారుగా రూ.300 కోట్లు విలువచేసే పంటలు దెబ్బతిన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215