logo

నేడు తునిలో పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 05 May 2024 03:46 IST

తుని గ్రామీణం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. చామవరం సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పవన్‌ కల్యాణ్‌ చామవరం హెలీప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఎస్‌.అన్నవరం నూకాలమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుంటారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు కూడలికి చేరుకుని బహిరంగ సభలో మాట్లాడుతారని జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి మధువీరేష్‌ వివరించారు. ఏర్పాట్లపై కార్యకర్తలు, నాయకులతో ఆయన చర్చించారు. పార్టీ నాయకులు సుంకర కృష్ణవేణి, చినబాబు, రాము, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని