శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు.
బాధితులు, విదసం నాయకుల డిమాండ్
బాధితులకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట విదసం నేతల నిరసన
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులతో కలిసి వారు శనివారం నిరసన తెలిపారు. నేరం జరిగే సమయానికి నిందితుడు తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉన్నారన్న విషయం విశాఖ ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వారు వాపోయారు. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పు నేర తీవ్రతకు తగ్గట్లుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధమైన చర్యలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉండాలని, ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాస్తూ బాధితులకు మొండి చేయి చూపుతోందని వారు ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం అప్పీలకు వెళ్లి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామన్నారు. అనంతరం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వి.రామకృష్ణ, బళ్ల కుమార్, కె.రాము, ఇక్బాల్, రాజేశ్, రేవు తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
తగిన న్యాయం చేయలేదు..
మాకు అన్యాయం జరిగి 27 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. వైకాపా ప్రభుత్వం నిందితుల పక్షాన నిలిచి తీవ్ర అన్యాయం చేసింది. ఈ కేసు విషయంలో విశాఖ కోర్డు ఇచ్చిన తీర్పు మాకు న్యాయ సమ్మతంగా అనిపించలేదు. దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రభుత్వం కూడా సహకరించాలి.
చల్లపూడి పట్టాభిరామయ్య, శిరోముండనం బాధితుడు
నిందితులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం..
శిరోముండనం కేసులో నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. తక్షణం ఈ కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తుల్ని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించి, తక్షణం శిక్ష అమలు చేయాలి. బాధితులకు న్యాయం చేయడంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. ఈ కేసుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
భూషి వెంకట్రావు, విదసం నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.