బీమా.. జగన్ డ్రామా..!
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్: ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అటువంటి సమయంలో వారిని ఆదుకుని, అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న బీమా పథకం పేరు మార్చడమే కాకుండా పూర్తిగా అటకెక్కించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కక రోడ్డున పడుతున్నాయి. అయినా పాలకులకు పట్టడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసినా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో..
తెదేపా ప్రభుత్వం హయాంలో చంద్రన్న బీమా పథకం పక్కాగా అమలయ్యేది. సహజ మరణం పొందిన 50 ఏళ్ల వయస్సు ఉన్న వారికి రూ.2 లక్షలు, 50 నుంచి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేలు పరిహారం అందించేవారు. కుటుంబలో ఎవరు చనిపోయినా పరిహారం దక్కేది. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు అందించేవారు. డ్రైవింగ్ లైసెన్స్తో సంబంధం లేకుండా పరిహారం వర్తింపజేసేవారు. ఆ మొత్తం రెండు నెలల్లో బాధితులకు చేరేది.
ఇప్పుడిలా..
వైఎస్ఆర్ బీమా పథకంలో మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది వరకు పాలసీదారులను నమోదు చేశారు. 18-50 ఏళ్లు ఉండి సంపాదించే వ్యక్తి సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.లక్ష, 18-70 ఏళ్ల మధ్య సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. తర్వాత మార్చిన నిబంధన ప్రకారం కుటుంబ యజమాని చనిపోతేనే పరిహారం అందుతుంది. మిగిలిన సభ్యుల్లో ఎవరు మరణించినా పరిహారం రాదని మెలిక పెట్టారు. 50 ఏళ్లు దాటిన కుటుంబ యజమాని సహజ మరణం పొందితే పరిహారం వర్తించదు. తెదేపా ప్రభుత్వ హయాంలో బీమా కార్డులో ఉన్న వారందరికీ పథకం వర్తించేది. ఇప్పుడు ఒక కార్డును ఒక్కరికే పరిమితం చేశారు.
మట్టి ఖర్చులకు మంగళం..
మరణం సంభవించిన రోజునే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. కాని వైకాపా ప్రభుత్వంలో నెలలు గడిచినా ఇవ్వడం లేదు. ప్రమాద మరణాలకు సంబంధించి ఎఫ్ఐఆర్, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక(పోస్టుమార్టం రిపోర్ట్) ఉంటేనే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. రహదారి ప్రమాదాల్లో చనిపోతే డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన కచ్చితం చేశారు. ఈ కారణంతో ప్రతీ సంవత్సరం అనేక మంది బాధితులు ఈ పథకానికి దూరం అవుతున్నారు.
మూడేళ్లలో 1683 మందికే లబ్ధి..
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ బీమా పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2500 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో కేవలం 1683 మందికి మాత్రమే పరిహారం అందించారు. మిగిలిన వారు పరిహారం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులను అడుగుతున్నా వారి వద్ద నుంచి ఏవిధమైన సమాచారం రావడం లేదని వారు వాపోతున్నారు.
మూడేళ్లు అయినా రాలేదు
నా భార్య సత్యవతి 2021లో మరణించింది. వెంటనే వైఎస్సార్ బీమా పథకానికి దరఖాస్తు చేశాం. అధికారులు అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేశారే తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అధికారులను గట్టిగా నిలదీస్తే కేవలం కుటుంబ యజయానికి మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇది చాలా దారుణం.
ఆదుర్తి దుర్గారావు, బోడసకుర్రు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
[ 18-05-2024]
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు