కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు.
రూ.15 వేల కోట్ల బియ్యం తరలించిన దుర్మార్గులు వీళ్లు
డ్రగ్ సిటీగా మార్చేశారు
కాకినాడ ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, కాకినాడ నగరం, సర్పవరం జంక్షన్, కరప
సభలో మాట్లాడుతున్న చంద్రబాబు, చిత్రంలో కూటమి అభ్యర్థులు కొండబాబు, పంతం నానాజీ, ఉదయ్ శ్రీనివాస్
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. గోదావరి జిల్లాలంటే ప్రశాంతతకు మారు పేరు. గౌరవం ఇస్తారు. అయిదేళ్లు ఏమైంది. రౌడీయిజం, నేరాలు పెరిగాయా లేదా..? గంజాయి వచ్చిందా లేదా..? ఏమిటీ అరాచకం.. పవిత్ర గోదావరి సాక్షిగా చెబుతున్నా.. ఇలాంటి దుర్మార్గులు వచ్చి జిల్లాను మరో పులివెందుల చేస్తామంటే వదిలిపెట్టమని హెచ్చరించారు. కాకినాడ సిటీని నాశనం చేసినవారిని ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
రోడ్షోలో చంద్రబాబు
మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా..
ఉద్యోగులు, పోలీసులు, యూనియన్లను జగన్ బెదిరించాడని.. మాట్లాడితే కేసు పెట్టి లోపల వేయించాడని.. ఆ బెదిరింపులను తాను, పవన్కల్యాణ్ లెక్కచేయలేదని చంద్రబాబు అన్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తానన్నారు. పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలని..ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ‘ఎవ్వరూ భయపడొద్దు..మీ ప్రాణానికి మా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటామ’ని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
తూరంగి వద్ద సైకిళ్ల హారం
వీళ్లను భూస్థాపితం చేద్దాం
‘ఈయన ఎమ్మెల్యే (కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిని ఉద్దేశించి).. వీళ్ల నాన్న సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల అసోషియేషన్ అధ్యక్షుడు.. దొంగలకు తాళాలు ఇచ్చాడు జగన్.. రూ.15 వేల కోట్ల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేసిన దుర్మార్గులు వీళ్లు.. అతి పెద్ద స్కాం ఇది..’ వీళ్లను భూస్థాపితం చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాకినాడను డ్రగ్ సిటీగా మార్చేశారన్నారు. సిటీ భూకబ్జాలు, అరాచకాలు, రౌడీయిజం, గూండాయిజం, క్రికెట్ బెట్టింగులు, పేకాట క్లబ్బులకు నిలయంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సభకు హాజరైన అశేష జనం
సైకో రాడని పోలీసులకూ తెలిసిపోయింది
ప్రజాగళం సభకు పోలీసులు పటిష్ట బందోస్తు కల్పించారు. సభా ప్రాంగణం నలువైపులా పహారా కాయడంతోపాటు జనాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు సైతం సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసులు బందోబస్తు బాగానే చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. సైకో జగన్ రాడని వారికి కూడా తెలిసిపోయిందన్నారు. ‘పోలీసులు మంచోళ్లే.. ఏం చేస్తాం.. జగన్ ఒత్తిడితో వారు ఆయన చెప్పినట్లు పనిచేయాల్సి వస్తోంద’ని వ్యాఖ్యానించారు.
కాకినాడలో రహదారి పొడవునా బారులుదీరిన మహిళలు
పవన్కల్యాణ్ కాలిగోటికి సరితూగవు..
‘ఇక్కడున్న ఎమ్మెల్యేకి కొవ్వెక్కింది. పవన్ కల్యాణ్కు సవాల్ విసురుతావా? ఆయన కాలిగోటికి కూడా నువ్వు సరితూగవు ఖబడ్దార్. ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. దోపిడీ చేసినంత సులువు కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడం. రౌడీలను నిర్మొహమాటంగా అణిచివేస్తాం. నిజ జీవితంలోనూ గబ్బర్సింగ్ పవన్కల్యాణ్. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి, కొవ్వెక్కి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు. వీరందరికీ కళ్లెం వేస్తా’మని చంద్రబాబు అన్నారు. సభలో కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్.. కాకినాడ నగర, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ
తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు