ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ,
నేడు ఒకే వేదికపై ప్రధాని మోదీ, పవన్, లోకేశ్
5 పార్లమెంట్ స్థానాల నుంచి రెండు లక్షల మంది వస్తారని అంచనా
వేమగిరిలో ప్రజాగళం సభకు ముస్తాబైన వేదిక
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, కడియం: సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరవనున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మూడు పార్టీల ముఖ్యనేతలూ రానున్నారు. కూటమితో భాజపా కలిసిన తర్వాత తొలిసభ చిలకలూరిపేటలో జరగ్గా.. రెండో సభకు రాజమహేంద్రవరం వేదికైంది.
చారిత్రక నగరానికి వస్తూ..
చారిత్రక నగరంగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరానికి ప్రధాని మోదీ రానుండడంతో అంతటా ఆసక్తి పెరిగింది. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం బరిలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్తో జరిగే అభివృద్ధిని మోదీ వివరించనున్నారు.
సభకు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, నర్సాపురం లోక్సభ స్థానాల పరిధిలోని ఎంపీ అభ్యర్థులతో పాటు సుమారు 2 లక్షల మంది జనం వస్తారని అంచనా.
విశాల ప్రాంగణంలో ఏర్పాట్లు..
తెదేపా మహానాడు నిర్వహించిన వేమగిరి మైదానంలోనే ఎన్డీఏ ‘ప్రజాగళం’ బహిరంగ సభ జరగనుంది. 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భారీ వేదికలు, పందిళ్లు వేశారు. కూలర్లు, ఏసీలు ఉంచారు. వాహనాల పార్కింగ్కు జాతీయ రహదారి పక్కన 10 స్థలాలు ఏర్పాటు చేశారు.
3 వేలమంది మంది బలగాలు..
చిలకలూరిపేటలో ప్రధాని బహిరంగ సభలో భద్రతాపరమైన లోపాలు తలెత్తడం, పలువురు ఐపీఎస్లపై వేటు పడిన క్రమంలో ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సివిల్ పోలీసులు, కేంద్ర బలగాలు కలిపి 3వేల మంది విధుల్లో ఉన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. పలు రాష్ట్రాల ఐజీలు, ఉన్నతాధికారులు సభాస్థలి వద్ద ట్రయల్రన్ నిర్వహించారు. ఎస్పీ జగదీశ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
మారిన షెడ్యూల్..
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సభావేదిక వద్దకు రావాల్సి ఉంది. తిరుగు ప్రయాణ సమయం, భద్రతా కారణాలతో మధ్యాహ్నం 3 గంటలకే ప్రధాని సభాస్థలికి చేరుకుంటారు. 3.45 గంటలకు సభ ముగించి అనకాపల్లి వెళ్తారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం లోక్సభ ఎన్నికల బాధ్యుడు సాగి కాశీవిశ్వనాథరాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
[ 18-05-2024]
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM