logo

రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం

రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా  తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమిగా ఏర్పాడ్డాయని,

Published : 06 May 2024 11:47 IST

 

తాళ్లపూడి :  రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా  తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమిగా ఏర్పాడ్డాయని, సైకో పాలనను అంతం చేసి విజయం సాధిస్తాయని ఉమ్మడి ఎమెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లపూడి మండలం తాడిపూడిలో ‘బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రజలకు మంచి పాలన అందిస్తుందన్నారు. మ్యానిఫెస్టోలో యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించామన్నారు. గ్రామంలోని పలువురు యువకులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో చాగల్లు జడ్పీటీసీ మాజీ సభ్యుడు విక్రమాదిత్య, ఉమ్మడి పార్టీల నాయకులు నామా నానిబాబు, గంటా కృష్ణ, చెన్నా సత్యనారాయణ, తిరుమలశెట్టి కృష్ణ, బ్రమిదల భీమరాజు, చింతపల్లి భీమరాజు, మచ్చా సూరిబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని