ఈసారి గెలిపిస్తే చేస్తారట.. ఈ అయిదేళ్లూ ఏం చేశారో..
అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్.
వైకాపా అభ్యర్థి భరత్ హామీలపై నగరవాసుల విస్మయం
వి.ఎల్.పురం, న్యూస్టుడే: అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్. పుష్కరఘాట్ వద్ద ‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో కూడిన కరపత్రాలను ఆయన ఈ నెల 4న ఆవిష్కరించారు. ఈసారి గెలిపిస్తే ఇవన్నీ చక్కదిద్దేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈసారి సరే.. మరి ఈ అయిదేళ్లూ ఏం చేసినట్టు అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
24 గంటలూ తాగునీరు ఇచ్చేస్తారట!
వైకాపా ఎంపీగా భరత్రామ్ రకరకాల ప్రకటనలు చేయడమే తప్ప ఆయా డివిజన్లలో పైపులైన్ల వ్యవస్థను మెరుగు పరచలేకపోయారు. కలుషిత జలాల కారణంగా అతిసారంతో నగరంలో ఇద్దరు మృతిచెందినా పట్టలేదు. వి.ఎల్.పురంతో పాటు నివాసానికి సమీపంలో ఉన్న ఆర్టీసీ కాలనీలోనూ పూటకు అరగంట కూడా సక్రమంగా తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. గోదావరి చెంతనే ఉన్నా తాగునీటికి నగరవాసులు అల్లాడిపోయే పరిస్థితి. ఎంపీ వాగ్దానంపై పలువురు నగరవాసులు పెదవి విరుస్తున్నారు.
బ్లేడ్ బ్యాచ్లను అరికట్టలేకపోయారు
ఎంపీగా ఉండి కూడా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయినప్పటికీ తాను ఎమ్మెల్యే అయితే రౌడీషీటర్లు, బ్లేడ్, గంజాయి బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తానని భరత్ చెప్పుకొచ్చారు. ఎంపీ పరిధి ఎక్కువ.. అప్పుడే చేయలేనిది ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలా చేస్తారన్నది జనం మాట.
విశ్వనగరంగా మారుస్తారా..
రివర్ సిటీ అందాలు చూసేలా ఘాట్లను ఏకం చేయడంతో పాటు గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తానని, విశ్వనగరంగా చేసేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన కంబాల చెరువు పార్కులోకి ఫీజు లేకుండా అడుగుపెట్టలేని విధంగా మార్చేశారని, ఇంకా విశ్వనగరం మారిస్తే తమ పరిస్థితేంటని పలువురి ప్రశ్న. విశ్వనగరం సంగతి దేముడెరుగు.. కనీస సౌకర్యాలు కల్పించాలన్నది సామాన్యుడి మాట.
స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతారట
వి.ఎల్.పురంలో స్టేడియం నిర్మాణానికి ఏడాదిన్నర కిందట మంత్రి రోజా చేతుల మీదుగా ఆర్భాటంగా శంకుస్థాపన చేసినప్పటికీ శిలాఫలకం కనుమరుగైందే తప్ప.. నేటికీ పనులు మొదలుకాలేదు. ఇప్పుడేమో నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని, క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం తీసుకొస్తున్నానని హామీ ఇచ్చారు. దీనిపైనా ఔత్సాహిక క్రీడాకారులు విస్తుపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
[ 18-05-2024]
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్