నేడు ఇంటి నుంచే ఓటు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు.
అవగాహన లోపం.. అర్హులు స్వల్పం
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు. ఆ పరిస్థితి నుంచి వారికి విముక్తి కల్పించేందుకు ఇంటి వద్దనుంచే ఓటేసే సదుపాయాన్ని ఈ ఎన్నికల్లో కల్పించారు. కానీ ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంలో విఫలం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 8,343 మంది, దివ్యాంగులు 25,998 కలిపి మొత్తంగా 34,341 మంది ఉన్నారు. వీరంతా ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులే. కానీ వీరికి అధికారులు ఈ ప్రక్రియపై అవగాహన అంతగా కల్పించలేదు. ఎక్కడా ఇంటి వద్ద నుంచి ఓటేసే కార్యక్రమంపై ఒక్క చైతన్య కార్యక్రమం కూడా నిర్వహించలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా కేవలం 1,251 మంది మాత్రమే హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హుల్లో 3 శాతం మంది మాత్రమే ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు రాలేక ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. దీనిని అరికట్టాలనే సదుద్ధేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన విధానం క్షేత్ర స్థాయిలో అధికారుల అలసత్వంతో చాలామంది అర్హులకు దూరమైంది.
73 బృందాల ఏర్పాటు..
జిల్లా వ్యాప్తంగా అర్హుల నుంచి హోం ఓటింగ్ ప్రక్రియలో ఓట్లు సేకరించేందుకు 73 బృందాలను నియమించారు. వీరికి 85 వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మంగళవారం ప్రారంభించి ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల మాదిరిగా వీరి ఓట్లు కూడా ప్రత్యేకంగా భద్రపరిచి స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నట్లు కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలతోపాటుగా కేంద్రాలకు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో