బీసీలపై కక్ష.. కోతలతో శిక్ష
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు.
అయిదేళ్ల జగన్ పాలనలో రాయితీ రుణాలకు ఎగనామం
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు. 2014 నుంచి 2019 వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాయితీ రుణాలు కల్పించి రూ.కోట్లలో లబ్ధి చేకూర్చారు. జగన్ సర్కార్ వచ్చాక.. బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. సంస్థను 56 విభాగాలుగా విభజించి, కార్పొరేషన్లు ప్రకటించి, పాలకవర్గాలు నియమించి, పైసా ఇవ్వకుండా మొండి చేయి చూపారు. అయిదేళ్ల కాలంలో చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న బీసీ వర్గాలకు ఒక్క స్వయం ఉపాధి యూనిట్ కూడా మంజూరు చేయలేదు. బీసీ యువతకు ఒక్క రాయితీ రుణం మంజూరు చేయలేదు. ఎన్నికల వేళ మళ్లీ నా బీసీలు ఉంటూ సీఎం జగన్ ఊదరగొడుతున్నారు. బీసీలను అట్టడుగుకు నెట్టేసిన జగన్ను మళ్లీ నమ్మే పరిస్థితి లేదని బీసీలు తేల్చి చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో రూ.237 కోట్ల లబ్ధి..
గత తెదేపా ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు, ఫెడరేషన్ గ్రూప్లు, అత్యంత వెనుకబడి వర్గాలకు రుణాలతో పాటు ఆదరణ పథకం ద్వారా పరికరాల పంపిణీకి రూ.237 కోట్లు ఖర్చు చేశారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం ఉపాధి రుణం కింద రూ.2 లక్షల యూనిట్లు మంజూరు చేశారు. దీనిలో గరిష్ఠంగా రూ.లక్ష రాయితీ ఇచ్చారు. జిల్లాలో 12 బీసీ ఫెడరేషన్లు ఉండగా, ఒక్కో ఫెడరేషన్లో 11 నుంచి 17 మంది సభ్యులు ఉండేవారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణం ఇచ్చారు. దీనిలో రూ.లక్ష రాయితీ కల్పించారు. ఇలా పెద్ద ఎత్తున అయిదేళ్ల తెదేపా పాలనలో బీసీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు కల్పించి జీవన ప్రమాణాలను మెరుగుపర్చారు.
కేంద్ర పథకాన్ని ఆపేశారు..
కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాలు(ఎంబీసీ)కు 90 శాతం రాయితీలో గరిష్ఠంగా రూ.30వేల వరకు రుణం మంజూరు చేస్తుంది. దీనిలో పది శాతం బ్యాంకు రుణం కల్పిస్తారు. మిగతా 90 శాతం రాయితీ కల్పిస్తారు. ఎంబీసీ పథకాన్ని తెదేపా హయాంలో పటిష్ఠంగా అమలు చేశారు. జగన్ సర్కార్లో గత అయిదేళ్లు ఈ పథకం జోలికి వెళ్లలేదు. ఒక్కరికీ స్వయం ఉపాధి రుణం మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు ముందుకు వచ్చినా.. జగన్ సర్కార్ ఆసక్తి చూపలేదు.
అటకెక్కిన ఆదరణ పథకం
బీసీ వర్గాల్లో చేతి వృత్తుల వారికి గత తెదేపా హయాంలో ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో ఆదర్శంగా అమలు చేసింది. రూ.3వేల నుంచి రూ.30వేల విలువైన వివిధ పనిముట్లను ఉచితంగా బీసీ వర్గాలకు అందజేశారు. 2014-19 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.26కోట్ల విలువైన పనిముట్లు అందజేశారు. వైకాపా సర్కార్ వచ్చాక గత అయిదేళ్లు ఈ పథకాన్నీ ఆపేసింది. దీంతో చేతి వృత్తులు చేస్తున్న బీసీలు ఎంతో నష్టపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
[ 18-05-2024]
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్