జనగళం జయభేరి
మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు..
కూటమి సభకు తరలివచ్చిన శ్రేణులు
న్యూస్టుడే రాజమహేంద్రవరం
నా యాత్ర దేశం కోసం.. ధర్మం కోసం..
మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు.. ఎటుచూసినా జనం జయభేరి మోగించారు. ప్రధాని మోదీ.. జనసేనాని పవన్ కల్యాణ్.. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్లు తమ ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రెట్టింపు సంక్షేమం సాధ్యమని వివరించారు. అభివృద్ధిలో జీరో.. అవినీతి వంద శాతం అంటూ వైకాపా పాలన తీరును ఎండగట్టారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ స్థానాల పరిధి నుంచి పెద్దఎత్తున జనం తరలివచ్చారు.
వందనం.. అభివందనం: ప్రధానికి నమస్కరిస్తున్న కూటమి అభ్యర్థులు
అభివృద్ధి కావాలా? విధ్వంసమా?
- ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమహేంద్రవరం నగర అభ్యర్థి
వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. యువతకు ఉద్యోగాలు లేవు. రైతులకు ఆసరా లేదు. ఈ ఎన్నికల్లో మన నినాదం ఒక్కటే ఏపీలో అభివృద్ధి కావాలా? విధ్వంసమా? రాజమహేంద్రవరం చారిత్రాత్మక నగరం. మనపై నమ్మకంతో పురందేశ్వరిని రాజమహేంద్రవరానికి ఇచ్చారంటే మనపై చాలా బాధ్యత ఉంది.
ఆంధ్రను అప్పులపాల్జేశారు
- ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు అభ్యర్థి
వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కల్పించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలు, మతాల మధ్య కలహాలకు కారణమైన జగన్.. మళ్లీ సీఎం అయితే ప్రజలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి.
త్రిమూర్తుల్లా జత కట్టారు
- బత్తుల బలరామకృష్ణ, రాజానగరం అభ్యర్థి
త్రిమూర్తుల మాదిరి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమికి ప్రాణం పోశారు. పదేళ్లుగా మోదీ దేశానికి ఎనలేని సేవ చేశారు. మూడోసారి ప్రధాని కావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రజల జీవితాలను వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి జగన్. ఏపీలో అభివృద్ధి జరగాలంటే కూటమికి పట్టం కట్టాలి.
జగన్ జైలుకెళ్లడానికి సిద్ధం
- బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం గ్రామీణ అభ్యర్థి
జగన్మోహన్రెడ్డి సిద్ధమంటున్నారు.. దేనికో తెలుసా.. ఈ ఐదేళ్లలో ఏపీలో దోచుకున్న డబ్బుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్నారు. రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి మీరూ సిద్ధమేనా..? అవినీతి, అరాచకం, అణచివేతతో దమనకాండతో ఐదేళ్లు వేధించిన జగన్కు మీ ఓటుతో బుద్ధిచెప్పండి.
మ్యానిఫెస్టో ప్రతి ఇంటికీ చేరాలి
- కందుల దుర్గేష్, నిడదవోలు అభ్యర్థి
దుర్మార్గపు, నియంతృత్వ వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి చేసే పోరాటంలో అంతా భాగస్వాములు కావాలి. పార్లమెంటుకు పురందేశ్వరిని తప్పక పంపించాలి. రాజకీయ, పదవీ కాంక్షతో కాదు.. ప్రజలకు సేవ చేయడానికే కూటమి అభ్యర్థులున్నాం. కూటమి మ్యానిఫెస్టో విశేషాలను ప్రతి ఇంటికీ తెలియజెప్పాలి.
రాక్షసుణ్ని సాగనంపాలి
- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి అభ్యర్థి
రాష్ట్రంలో రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించడం కోసం.. రాక్షసుణ్ని ఇంటికి పంపించడం కోసం.. కూటమి కృషిచేస్తోంది. మూడు పార్టీల కలయిక పవిత్ర త్రివేణి సంగమంతో సమానమైంది. ఏపీలో అభివృద్ధి లేదు. అవినీతి రాజ్యమేలుతోంది. కూటమి అత్యధిక స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తుండడం శుభ పరిణామం.
ప్రధానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పరిచయం చేస్తున్న లోకేశ్
సభలో లోకేశ్, పురందేశ్వరి చిరునవ్వులు
అచ్చంగా.. నమో మెచ్చంగా..
ప్లకార్డులతో భాజపా, తెదేపా శ్రేణుల సందడి
జన ప్రవాహం: సభకు తరలివచ్చిన ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో