జగన్ ఇష్టారాజ్య చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది.
న్యూస్టుడే, మసీదుసెంటర్(కాకినాడ): ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది. కోర్టులకు అధికారం తీసేసి ప్రభుత్వం నియమించిన టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి(టీఆర్వో)కి సర్వాధికారాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్వో అధికారంలో ఉన్న నాయకుల ఒత్తిడికి తలొగ్గితే వాస్తవ హక్కుదారులకు ఎంతో నష్టం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం స్థిరాస్థులను కాపాడుకోవడం అంత సులువు కాదని న్యాయవాదులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయవాదులు సుదీర్ఘ పోరాటం చేశారు.
అశాంతి, అభద్రత పెరుగుతుంది..
-కంబాల శ్రీధర్, సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, కాకినాడ
ఆ చట్టం ప్రజల ఆస్తిహక్కును హరించేటట్లు ఉంది. పారదర్శకత లేదు. వివాదం తలెత్తినప్పుడు సివిల్ కోర్డులో కేసులు దాఖలు చేసే అవకాశం ఉండదు. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి చీకటి చట్టం వల్ల ప్రజల్లో అశాంతి, అభద్రతాభావం పెరుగుపోతుంది.
ఈ చట్టంతో ఎవరికి మేలో చెప్పాలి..
- కొటికలపూడి సత్యశ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు
ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా ఇలాంటి చట్టం చేయడం సరికాదు. ఈ చట్టం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో చెప్పాలి. స్థానిక సివిల్ కోర్టులకు అధికారం తీసేసి హైకోర్టుకు మాత్రమే వెళ్లమనడం ఎంత వరకు న్యాయం. చాలామంది బాధితులు హైకోర్టుకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు. టీఆర్వోలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. వీరు అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా పని చేసే అవకాశం ఉంది. దీంతో పలుకుబడి ఉన్నవారు భూములు కాజేసే వీలుంటుంది. అసెంబ్లీలో సైతం ఈ చట్టంపై చర్చించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలు తమ భూములపై హక్కులను కోల్పోతారు.
అనుమతులకు క్యూ కట్టాల్సిందే..
-ఏవీసీహెచ్ఎన్ఎన్ మూర్తి, సీనియర్ న్యాయవాది, కాకినాడ
ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి, అభ్యంతరాలు తెలుసుకున్న తర్వాతే తీసుకురావాలి. అలా చేయకుండా రాత్రి రాత్రికే తీసుకురావడంతో చీకటి చట్టంగా మిగిలింది. కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, టీఆర్వోల వద్ద అనుమతుల కోసం క్యూ కట్టాల్సిందే. ఈ చట్టాన్ని రద్దుచేయాలని ఇప్పటికే సుదీర్ఘకాలం పోరాటాలు చేశాం. భవిష్యత్తులోనూ చేస్తాం. ఇది సరైన చట్టం కాదు. న్యాయస్థానాలకు ఉన్న అధికారం తీసివేసే అధికారం ప్రభుత్వానికి లేదు.
ప్రాథమిక హక్కులను కాలరాయడమే..
-బొగ్గవరపు గోకులకృష్ణ, స్టేట్ బార్ కౌన్సిల్ మాజీ సభ్యులు
ఈ చట్టం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం. రాజ్యాంగం కల్పించిన హక్కులను భక్షించే విధంగా ఉంది. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. దీనిని రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడం వల్ల ప్రభుత్వానికి అవసరమైన అనుమతులు వస్తాయి తప్ప, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. టీఆర్వోకు అఫిలేట్ అథారిటీ ఇవ్వడం సరికాదు. ఈ చట్టం అమల్లోకి వస్తే మరికొన్ని యాక్ట్లు కనుమరుగైపోతాయి. ప్రజల ఆస్తులకు రక్షణ కొరవడుతుంది.
వ్యవస్థలను భ్రష్టుపట్టించేందుకే తెచ్చారు
-జి.మోహన్మురళి, సీనియర్ న్యాయవాది, కాకినాడ
ఈ చట్టంతో ప్రజలు వారికి తెలియకుండానే ఆస్తులపై హక్కులు కోల్పోతారు. న్యాయ, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్న సందర్భంలోనూ సివిల్ కేసులు నానాటీకీ పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థలను మూసేసి ఆస్తులకు సంబంధించిన సర్వాధికారాలు కేవలం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(టీఆర్వో) చేతిలో పెట్టడం సరికాదు. వాళ్లపై స్థానిక రాజకీయనాయకులు అజమాయిషీ చలాయించేలా చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఉద్దేశించిన చట్టమే ఇది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.