ఐదు తరగతులకు ఒక్కరే
వినుకొండ నాలుగో వార్డు మండల పరిషత్ పాఠశాలలో ఐదు తరగతుల్లో 51 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది జూన్లో ఇద్దరిలో ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేయడంతో పోస్టు ఖాళీ అయింది. బడి తెరిచినప్పటి నుంచి నాలుగు నెలలుగా ఒక్కరే పని
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
ముందుకు సాగని విద్యార్థుల చదువులు
వినుకొండ నాలుగో వార్డులో ఐదు తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు
వినుకొండ నాలుగో వార్డు మండల పరిషత్ పాఠశాలలో ఐదు తరగతుల్లో 51 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది జూన్లో ఇద్దరిలో ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేయడంతో పోస్టు ఖాళీ అయింది. బడి తెరిచినప్పటి నుంచి నాలుగు నెలలుగా ఒక్కరే పని చేస్తున్నారు. యాప్లు నమోదు చేయడం, ఫొటోలు తీయడంతో పాటు పిల్లల్ని గొడవ చేయకుండా కూర్చోబెట్టడానికే అయనకు సమయం సరిపోతోంది. తాత్కాలికంగా మరొకర్ని సర్దుబాటు చేయమని విద్యాశాఖాధికారులకు విన్నవించినా ఫలితం లేదు.
రేపల్లె మండలం ఉయూరువారిపాలెంలో ఏకోపాధ్యాయిని పని చేస్తున్నారు. రెండో ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేయడంతో ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచి ఆమె ఒక్కరే పని చేస్తున్నారు. ఐదు తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం అలవిగాని పనిగా మారింది.
వినుకొండ, రేపల్లె అర్బన్, న్యూస్టుడే : ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతుంటే.. ఐదింటికి ఒక్కరితోనే నడిపిస్తోంది విద్యాశాఖ. రోజు ఉదయం మూడు యాప్ల నమోదు, 13 ఫొటోలు అప్లోడు చేయడం తప్పనిసరి కావడంతో రోజులో సగం కాలం దానికి సరిపోతోంది. సిగ్నల్స్ లేక సెల్ఫోన్లో చక్రం గిరిగిరా తిరుగుతుంటే అందులోనే ముఖం పెట్టి కూర్చోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో బడిలో చదువులు ఎలా ముందుకు సాగుతాయో ఊహించొచ్ఛు విద్యార్థికి ప్రాథమిక విద్య పటిష్ఠం కావాల్సిన తరుణంలో అధికార నిర్వహణ లోపం పిల్లలకు శాపంగా మారనుంది. కరోనా నేపథ్యంలో పల్లెల నుంచి పట్టణాలకు పిల్లల్ని బస్సులో పంపేందుకు తల్లిదండ్రులు విముఖత వల్ల ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్లుగా బోధన సిబ్బంది లేనందున ఇబ్బంది పడుతున్నారు. 2018 డీఎస్సీ తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు లేవు. క్వాలిఫైడ్ అభ్యర్థులతో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలను పరిశీలిస్తున్నామని పాలకుల చెప్పిన మాటలు ఆచరణలో ఇప్పటి వరకు అమలు కాలేదు.
ఇబ్బందులివే..: ఉన్న ఒక ఉపాధ్యాయుడు హెచ్ఎం బాధ్యతలు నిర్వహించాలి. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం అన్నీ పనులు ఒక్కరే చూసుకోవాలి. అధికారులు కోరిన సమాచారం వెంటనే పంపాలి. వ్యక్తిగత సెలవుపై వెళ్లినప్పుడు ప్రత్యామ్నాయం చూపించాలి. ఇవన్నీ చేయాలంటే ఐదు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోపెట్టాలి. దీంతో 1,2,3 తరగతుల విద్యార్థులకు అక్షరాలు, ఇతర పాఠ్యాంశాలు చెప్పడం కష్టతరం. తద్వారా బోధనలో వారికి సరైన న్యాయం చేకూరడం లేదన్నది వాస్తవం.
మండలాల వారిగా ఇదీ పరీస్థితి
వినుకొండ మండలంలో నరగాయపాలెం, రామకృష్ణాపురం, గోనుగుంట్లవారిపాలెం, పెదకంచర్ల (ఎస్సీ), అయ్యన్నపాలెం, కొప్పుకొండ తండా, వినుకొండ 4వవార్డు మొత్తం ఏడు ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. బొల్లాపల్లిలో 11, మాచవరం రెండు, రేపల్లె 13, నగరం 20, నిజాంపట్నం 18, చెరుకుపల్లి 9, బాపట్ల 12, కర్లపాలెం 9, పిట్టలవానిపాలెం 10 పాఠశాలలు ఇలాగే ఒక్కరితో కొనసాగుతున్నాయి.
సర్దుబాటు ప్రయత్నంలో ఉన్నాం
మిగులున్న వారిని అవసరమైన చోటుకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కొన్ని మండలాల్లో పోస్టులు ఖాళీలున్నాయి తప్ప మిగులు లేరు. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న చోట ఏకోపాధ్యాయ పాఠశాలగానే పని చేస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే రెండో ఉపాధ్యాయుడు నియామకం అవసరం. సెలవు పెడితే ప్రత్యామ్నాయం చూపించడమే కష్టతరంగా ఉంది. - సయ్యద్ జఫ్రుల్లాఖాన్, మండల విద్యాశాఖాధికారి
జిల్లాలో..
మొత్తం ప్రాథమిక పాఠశాలలు 2718
విద్యార్థుల సంఖ్య 1,74,480
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?