రూ.4.63 లక్షల ఉపాధి నిధులు దుర్వినియోగం
‘కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లు’గా ఉంది సామాజిక తనిఖీ వ్యవహారం. 2019- 20, 2020- 21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మాచవరం మండలంలో రూ.5.06 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయగా..
మాచవరం, న్యూస్టుడే : ‘కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లు’గా ఉంది సామాజిక తనిఖీ వ్యవహారం. 2019- 20, 2020- 21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మాచవరం మండలంలో రూ.5.06 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయగా.. అందులో రూ.4.63 లక్షలు దుర్వినియోగం అయ్యాయని అధికారులు తేల్చారు. సమావేశంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ ఏమైనా తప్పులుంటే మన్నించాలని కోరారు. దీంతో విచారణ అధికారులు కొన్నింటిని చూసినా, చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గురువారం రాత్రి స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జరిగిన ‘ప్రజా వేదిక’ విచారణను అందరూ మమ అనిపించారు. మస్టర్లలో కొట్టివేతలు, సిమెంట్ రహదారుల పనుల్లో వ్యత్యాసాలు, పొలాల్లో నాటిన మొక్కలు తగ్గటం, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు రికార్డులు చూపకపోవడం వంటి కారణాలతో అధికారులు రూ.4.63 లక్షలను ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి రికవరీ విధించారు. అలాగే వేమవరం అటవీ సెక్షన్లో చేపట్టిన రూ.6.17 లక్షల పనులకు రికార్డులు చూపకపోవడంతో ఆ శాఖ అధికారులకు మేజర్ జరిమానా విధించారు. నిర్ణీత గడువులోగా వ్యక్తిగతంగా హాజరై వివరాలు సమర్పించాలని, లేకుంటే రికవరీ విధిస్తామని విచారణ అధికారులు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?