రాయితీలకు మంగళం
పశు పోషణకు గ్రాసం భారంగా మారింది. రబీ కింద సాగు చేసిన పంటలు ప్రస్తుతం చేతికొస్తున్నాయి. వీటిలో వరి నుంచే గ్రాసం అత్యధికంగా వస్తుంది. శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి, వినుకొండ మండలం,....
పాడి పరిశ్రమకు అందని ప్రభుత్వ ప్రోత్సాహకాలు
గ్రాసం ధర పెరిగి.. పశు పోషకుల ఇబ్బందులు
వినుకొండ, శావల్యాపురం, న్యూస్టుడే
పశుగ్రాసాన్ని తరలిస్తున్న రైతులు
పశు పోషణకు గ్రాసం భారంగా మారింది. రబీ కింద సాగు చేసిన పంటలు ప్రస్తుతం చేతికొస్తున్నాయి. వీటిలో వరి నుంచే గ్రాసం అత్యధికంగా వస్తుంది. శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి, వినుకొండ మండలం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తదితర మండలాలకు చెందిన పశు పోషకులు గ్రాసాన్ని అధిక ధరలకు కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎత్తివేయడంతో నేడు పోషకులే పూర్తి మొత్తం భరించాల్సి వస్తోంది.
వేసవి రాగానే.....
వేసవి రాగానే గ్రాసం ధరలకు రెక్కలొస్తున్నాయి. పంట పొలాల వద్దకే రైతులు వెళ్లి పొలం విస్తీర్ణం బట్టి గ్రాసం ధర ఖరారు చేసుకుని కొంటున్నారు. ఎకరం పొలంలోని వరి గడ్డి రూ.10 వేల వరకు ధర పలుకుతోంది. అదే ధరకు రైతులు కొంటున్నారు. దీనికి తోడు ఎండు గడ్డిని ఇంటి వద్దకు సరఫరా చేసేందుకు రూ.2 వేలు వ్యయం అవుతుంది. జిల్లాల్లో పశు సంపదను కాపాడుకునేందుకు గతంలో ప్రభుత్వం రాయితీపై గ్రాసం, దాణా, ఇతర ఆహార పదార్థాలను అందించేది. మూడేళ్లుగా ఆ పథకాలు అమలు కావడం లేదు. దీంతో రైతులే పశుగ్రాసం కొని పశువులను పోషించుకుంటున్నారు. గతంలో 50 రాయితీపై దాణా సరఫరా చేసే వారు. సైలేజ్ గడ్డి, కరవు దాణా రాయితీపై ప్రభుత్వం పాడి పోషకులకు అవసరమైన మేరకు సరఫరా చేస్తుండేది. ఈ గ్రాసం పోషక విలువలతో కూడినది కావడంతో పాడి రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది.
పాడిపోషకులకు ఇబ్బంది రానీయం
ప్రభుత్వం దాణా సరఫరాకు సంబంధించి ఇంకాను బడ్జెట్ కేటాయించలేదు. కేటాయించగానే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై దాణా అందజేస్తాం. ఇప్పటికే పశుగ్రాసం కత్తిరించే యంత్ర పరికరాలు, టీఎంఆర్ దాణా అందజేస్తున్నాం. బడ్జెట్ కేటాయింపులు రాగానే పశు పోషకులకు 50 శాతం రాయితీపై దాణాను రైతులకు అందుబాటులోకి తీసువస్తాం. పోషకులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. - సాంబశివరావు డీడీ నరసరావుపేట
అన్నీ పెరిగాయ్
ఉమ్మడి గుంటూరు జిలాల్లో నుంచి రోజుకు 3.50 లక్షల లీటర్ల పాలు సేకరణ చేస్తారు. వీటిలో వినుకొండ డివిజన్లో అత్యధికంగా 75 వేల లీటర్లు వస్తుండటం విశేషం. మిక్సెడ్ దాణా 50 కిలోల బస్తా రూ.1200 ఉండగా, ఇటీవల బస్తాపై రూ.200 ధర పెరిగింది. తవుడు 50 కిలోలు రూ.1000 ఉండగా, గత నెల రోజుల్లో రూ.1400కు పెరిగింది. పశువుల దాణా బస్తాపై రూ.100 పెరగడంతో కొనలేని పరిస్థితి ఉందని, రాయితీపై అందించాలని శావల్యాపురానికి చెందిన దుర్గ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?