‘మోసానికి’ బ్రాండ్ అంబాసిడర్
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు.
రాజధాని రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధిని తొక్కేసిన సర్కారు
అడవిలా మారిన స్థలాలు
నైరాశ్యంలో అన్నదాతలు
కోర్టులో ప్రమాణపత్రం ఇచ్చాక.. పనుల నిలిపివేత
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - తుళ్లూరు
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. కొన్ని ప్రాంతాల్లో తూతూమంత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేసి.. తర్వాత ఆ పనులనూ ఆపేసింది. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యల కారణంగానే రైతుల ప్లాట్లు అడవిని తలపిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇక్కడ అభివృద్ధికి నిధులు వెచ్చించడం ఇష్టం లేకే నాటకాలాడుతోందని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగా పనులు
రాజధాని కోసం గత ప్రభుత్వం 34 వేల ఎకరాలను భూసమీకరణ విధానంలో తీసుకుంది. ఇందుకుగాను రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇవ్వాలన్నది ఒప్పందం. ఇలా కేటాయించిన మొత్తం ప్లాట్లు 64,735. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతుల పేర్లతో సుమారు 40 వేలకుపైగానే ప్లాట్లను రిజిస్టర్ చేసింది. జగన్ సర్కారు వచ్చాక ఈ ప్రక్రియను నిలిపేయడంతో రైతులు హైకోర్టుకెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. రైతులకు అన్ని వసతులతో ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని రెండేళ్ల క్రితం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సీఆర్డీఏ 13 జోన్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 16,400 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచింది. 11 జోన్లకు ఖరారు చేసి గుత్తేదారులను ఎంపిక చేసింది. ప్లాట్లలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కోసం 2022 జులైలో పనులు ప్రారంభించారు. కొన్నాళ్లు కంపచెట్లు తొలగించిన అనంతరం సీఆర్డీఏ మొత్తం పనులను నిలిపేసింది.
తుళ్లూరులో రైతులకు ఇచ్చిన నివాస ప్లాట్ల దుస్థితి
ఎవరి ప్లాట్ ఎక్కడో..?
రైతుల ప్లాట్లలో రూ. 16,400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. దీనికి సాక్ష్యంగా పలు చిత్రాలను జత చేసింది. తిరిగి ఏడాదిన్నర క్రితమే సీఆర్డీఏ అధికారులు ఆ పనులను నిలిపేశారు. అప్పట్నుంచి ఈనాటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. జంగిల్ క్లియరెన్స్ చేసిన ప్రాంతంలో ముళ్లకంపలు దట్టంగా పెరిగిపోయాయి. పనుల కోసం రూ. 3,500 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నట్టు చెప్పి.. ఆ తరువాత మిన్నకుండిపోయింది. దీంతో బ్యాంకర్లు ముందుకు రాలేదు. విశాఖకు పరిపాలనను మార్చాలన్న తలంపుతో ఉన్న జగన్.. అమరావతిని కావాలనే నిర్లక్ష్యం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్ముదామంటే.. కొనేవారేరీ..?
అవసరాల కోసం ప్లాటు అమ్ముకుందామన్నా కొనేవారు రావటం లేదు. పిల్లల చదువులు, వివాహాలు, ఆరోగ్య అవసరాల కోసం అప్పులు చేస్తూ రాజధాని రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం సీఆర్డీఏ అట్టహాసంగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన దొండపాడు, పిచ్చికులపాలెం, అనంతవరం, తుళ్లూరు గ్రామాల సమీపంలో ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. ఆ ప్లాట్లలోకి అడుగు పెడదామన్నా వీలు కాని పరిస్థితి. కనుచూపు మేర అడవిలా విస్తరించింది. దీనికితోడు ఎవరి ప్లాట్ ఎక్కడుందో తెలియని పరిస్థితి. హద్దులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. జగన్ ప్రభుత్వ తీరు రైతులకు శాపంలా మారింది.
నా స్థలానికి వెళ్లేందుకు దారి లేదు
- చంద్రశేఖర్, రైతు, దొండపాడు
రాజధాని నిర్మాణానికి 4.5 ఎకరాలిచ్చా. గత ప్రభుత్వం లాటరీ విధానంలో నాకు ప్లాట్లు కేటాయించింది. జగన్ వచ్చాక.. రాజధాని భూములన్నీ ముళ్లకంప చెట్లతో అడవిలా మారిపోయాయి. నా ప్లాటు ఎక్కడుందో తెలియని పరిస్థితి. అక్కడకు వెళ్లేందుకు కనీసం దారి కూడా లేదు. అమ్మేద్దామనుకున్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నా.
అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నా..
- వీరయ్య, రైతు, ఐనవోలు
చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో భూసమీకరణలో నేను 3.5 ఎకరాలిచ్చా. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటూ అమరావతిని అటకెక్కించింది. మా ప్లాట్లలో ఎటు చూసినా కంపచెట్లే కనిపిస్తున్నాయి. నాకు ఇద్దరమ్మాయిలు. వాళ్ల ఇంజినీరింగ్ చదువుల కోసం ప్లాటు అమ్ముదామనుకున్నా రేట్లు పడిపోయాయి. చేసేది లేక అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
[ 18-05-2024]
పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. -
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
[ 18-05-2024]
జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. -
సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపొద్దు: ఈసీ
[ 18-05-2024]
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
[ 18-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు