‘జలకళ’లో జగన్ దగా
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం.
బోర్ల పేరుతో రైతులకు మోసం
మోటార్లు, విద్యుత్తు కనెక్షన్లు లేక నిరుపయోగం
న్యూస్టుడే, వినుకొండ, వినుకొండ గ్రామీణ
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు మాత్రం బోర్లతో పాటు మోటార్లు కూడా బిగిస్తున్నాం. -2020 సెప్టెంబరు 28న వైఎస్ఆర్ జలకళ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలివి.
సీఎం మాటలు ఆచరణలో ఉత్తమాటలేనని తేలాయి. పథకంలో నమోదు చేసుకున్న అందరికీ బోర్లు వేయలేదు. వేసిన చోట మోటార్లు ఇవ్వలేదు. కరెంట్ కనెక్షన్లు ఏర్పాటు చేయకుండా కాలం వెళ్లబుచ్చారు. నూజండ్ల మండలం ముక్కెళ్లపాడుకు చెందిన సన్నకారు రైతు శివాజి హనుమంతరావు పొలంలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద బోరు వేసి మూడేళ్లయింది. మోటారు, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది. పల్నాడు జిల్లాలో జలకళ లబ్ధిదారులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు పదిశాతానికి మించి బోర్లు పనిచేయడం లేదంటే పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసు కోవచ్చు.
మంజూరు ఇలా..
చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని, బీడు భూములను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. 2020 సెప్టెంబరు 28న సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు ద్వారా సాగు నీరందించడమే లక్ష్యమని చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా సచివాలయాల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను వీఆర్వో పరిశీలించి డ్వామా ఏపీడీకి పంపిస్తారు. అక్కడి నుంచి భూగర్భ జల సర్వే కోసం జియాలజిస్టులకు చేరతాయి. నీటి లభ్యత ఉన్న వాటికి ఏపీడీ పరిపాలనా అనుమతి ఇస్తారు. తదుపరి బోరు వేసి మోటారుతోపాటు విద్యుత్తు కనెక్షన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పైసా ఖర్చు లేకుండా రైతుల భూములకు జలకళ తీసుకొస్తామని చెప్పారు.
నూజండ్లలో అంజయ్య పొలంలో నిరుపయోగంగా ఉన్న బోరు
దరఖాస్తులు 10వేలు.. విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చింది 116
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రైతుల నుంచి 10389 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత గ్రౌండ్ వాటర్ సర్వే విభాగం గుర్తించిన వాటిల్లో 3580 బోర్లకు అనుమతించారు. అందులో 1032 చోట్ల డ్రిల్లింగ్ పూర్తి చేశారు. ఇందులో మాచర్ల నియోజకవర్గంలో 594, వినుకొండ నియోజకవర్గంలో 200 ఉన్నాయి. గురజాల వంటి చోట్ల ఒక్కటీ లేదు. విద్యుత్తు కనెక్షన్లకు 818 బోర్లకు ప్రతిపాదన పంపితే విద్యుత్తుశాఖ 238కి మాత్రమే అనుమతించి జులై నాటికి కేవలం 116 మాత్రమే స్తంభాలు, లైన్లు పూర్తి చేశారు. వాటికి ప్రభుత్వం మోటార్లు ఇవ్వనందున అమర్చిన విద్యుత్తు పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది రైతులు మాత్రం సొంత ఖర్చుతో పంప్సెట్లు అమర్చి వినియోగిస్తుండగా మరికొందరు అంత పెట్టుబడి పెట్టలేక బోర్లు ఖాళీగా వదిలేశారు. రిగ్ యజమానులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో బోర్ల డ్రిల్లింగ్ చాలాకాలం క్రితమే ఆపేశారు.
ఉచిత బోర్లకు అందిన దరఖాస్తులు: 10168
నీరు పడిన బోర్లు : 974
విద్యుత్తు కనెక్షన్లు ఉన్నవి 116
కనెక్షన్ ఇవ్వలేదు
పొలంలో బోరు వేసి ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్, మోటారు ఇవ్వలేదు. అధికా రులను అడిగితే రాలేదని సమా ధానం చెబుతున్నారు. సొంతంగా చేసుకోవాలంటే రూ.లక్ష ఖర్చు అవుతుంది. సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్నందున కనెక్షన్ ఇస్తే బోరును వినియోగించుకుంటా.
రాగిపూడి అంజయ్య, నూజండ్ల
బోరు వేసి మోటారు ఇవ్వలేదు
జలకళ పథకం కింద పొలంలో బోరు వేసి ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్, మోటారు ఇవ్వలేదు. దీంతో బోరు నిరుపయోగంగా మారింది. నాలాగే చాలామందికి బోరు వేసి వదిలేశారు. అందరం విద్యుత్తు కనెక్షన్, మోటార్ల కోసం ఎదురు చూస్తున్నాం.
చిన్న భాస్కరరావు, అల్లిబాయిపాలెం, నూజండ్ల మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
[ 17-05-2024]
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
[ 17-05-2024]
ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. -
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
[ 17-05-2024]
వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
[ 17-05-2024]
గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. -
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
[ 17-05-2024]
తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. -
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ వేయనుంది. -
పంచాయతీలో పండ్ల వ్యాపారం
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కోరినపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం మామిడి పండ్లు అమ్మకానికి పెట్టారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. -
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి