గుండెలదిరేలా గ్రామాల రోడ్లు
పల్లెల మధ్య రహదారులు అధ్వానం
అయిదేళ్లలో నిర్వహణకు నిధులివ్వని జగన్
ఈనాడు, నరసరావుపేట, న్యూస్టుడే, రొంపిచర్ల, చిలకలూరిపేట గ్రామీణ
అధ్వానంగా వినుకొండ- పానకాలపాలెం దారి
గ్రామాల నుంచి గ్రామాలకు అనుసంధానం చేసే పల్లెదారులు... పల్లెల నుంచి మండల కేంద్రాలకు రాకపోకలు సాగించే రహదారులను అయిదేళ్ల వైకాపా పాలనలో పట్టించుకోకపోవడంతో నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. పల్లెలను అనుసంధానం చేసే కొత్త రహదారులు వేయకపోగా పాత వాటిని కూడా అభివృద్ధి చేయకపోవడంతో పల్లెవాసుల పాట్లు వర్ణనాతీతం. కేంద్రం నుంచి వంద శాతం గ్రాంటుతో వచ్చే నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చకపోవడం, కేంద్రం ద్వారా వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వక పనులు నిలిచిపోయాయి. తుపానులు, భారీవర్షాలకు వాగులు ఉప్పొంగి అనుసంధాన రహదారులు కోతకు గురైనా పట్టించుకునేవారు కరవయ్యారు. జగన్ నోరు తెరిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఊదరగొడుతుంటారు. వీరంతా ఎక్కువగా నివసించే పల్లెల్లో రహదారులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాని నిధులు
ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఆర్థిక సాయంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీ రాజ్ రోడ్లను కొన్నింటిని ఎంపికచేసి ఒక ప్యాకేజీ కింద తీసుకుని అభివృధ్ధి చేస్తున్నారు. ఇందులో 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా సమకూర్చాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేయాలి. అయితే రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. బాపట్ల జిల్లాలో రూ.77 కోట్లతో 30 రోడ్ల పనులు చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు అర్ధంతరంగా పనులు ఆపేశారు. న్యాయస్థానానికి వెళ్లి బిల్లులు తెచ్చుకున్న గుత్తేదారు మిగిలిన పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.
అందని నిధులు : ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో మార్కెట్ కమిటీల నుంచి నిధులు తీసుకుని ఆయా కమిటీల పరిధిలో పంచాయతీరాజ్ రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీర్లు ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు సైతం పిలిచారు. పల్నాడు జిల్లాలో కొన్ని పనులు కూడా ప్రారంభించారు. ఈ దశలో మార్కెటింగ్శాఖ యార్డుల నిర్వహణ, ఇతర అవసరాలకు సొమ్ము లేక ఇబ్బందులు పడుతుంటే తాము రహదారుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలిచిన టెండర్లు రద్దుచేయగా ఒప్పందాలు చేసుకున్న గుత్తేదారులు పనులు చేయలేదు.
పల్లెదారులు.. పడరాని పాట్లు
ప్రతి మండలంలో 30 నుంచి 35 వరకు పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా 12 అడుగుల బీటీ, మెటల్, మట్టిరోడ్లతో కూడిన సింగిల్రోడ్లు. గ్రామంలో మాత్రం సిమెంట్ రహదారులు ఉంటాయి. వీటి నిర్వహణతోపాటు ఏటా కొన్ని రోడ్లు అభివృద్ధి చేసి ప్రయాణాలు సాఫీగా చూడాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు, ప్రధాన రహదారి నుంచి గ్రామాల్లోకి వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వైకాపా పాలనలో పట్టించుకోకపోవడంతో గోతులమయమై కొన్నిచోట్ల ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి. గ్రామీణులు ఎక్కువగా ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మిగ్జాం తుపాను, భారీవర్షాలకు వాగులు ఉప్పొంగి పల్లెదారులు కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. ఎక్కువగా మట్టిరోడ్లు కావడంతో వర్షాకాలంలో నీరు నిలిచినప్పుడు వాహనాల రాకపోకలతో గోతులు మరింత పెద్దవయ్యాయి. పల్నాడు జిల్లాలో వాగుల వల్ల కోతకు గురైన రహదారులు బాగు చేయకపోవడంతో పల్లెవాసులు చుట్టూ తిరిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.
పల్నాడులో సుమారు రూ.85 కోట్లతో చేపట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వందశాతం నిధులను కేంద్రం గ్రాంటుగా ఇస్తుండగా వాటిని మాత్రమే పూర్తిచేశారు. కేంద్రం పెట్టిన షరతులకు అనుగుణంగా కొన్ని రహదారులు అభివృద్ధి చేశారు. ఇవి మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి రోడ్లు అభివృధ్ధి చేయలేదు.
రొంపిచర్ల మండలం సంతగుడిపాడు నుంచి కర్లకుంట గ్రామానికి వెళ్లే రహదారిని 2014లో నిర్మించారు. కాలక్రమంలో రోడ్డుపై కంకరరాళ్లు బయటపడ్డాయి. గుంతల్లో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కర్లకుంట గ్రామానికి చెందిన 2,300 మంది ఇతర గ్రామాలకు రావాలన్న, విద్యార్థులు ఉన్నత చదువుకు వేరే గ్రామాలకు పోవాలన్నా ఈ రహదారే దిక్కు. ఇది అధ్వానంగా మారినా మరమ్మతులకు నోచుకోలేదు. గుంతలు పడిన మార్గంలో ప్రయాణిస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడిన ఘటనలూ ఉన్నాయి.
చిలకలూరిపేట మండలం గొట్టిపాడు నుంచి గోరంట్లవారిపాలెం, ఈవూరివారిపాలెం, నాగభైరువారిపాలెం వెళ్లే రహదారి ఇది. 2కి.మీ. దూరం దారుణంగా ఉంది. ఈ రహదారిని సీసీ రహదారిగా నిర్మించాలని నాలుగు గ్రామాల ప్రజలు చేస్తున్న విజ్ఞప్తి వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పట్టించుకోలేదు. వర్షంపడితే ఈ మార్గంలో నడవడానికి కూడా అవకాశం ఉండదు. చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. పంచాయతీరాజ్ అధికారులకు ప్రజలు మొరపెట్టుకున్న ప్రతిసారి ప్రతిపాదనలు పంపుతున్నాం. నిధులు వస్తాయంటూ మాటలతో కాలం వెళ్లదీశారు. గత డిసెంబరులో కురిసిన వర్షానికి ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
[ 18-05-2024]
జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. -
సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపొద్దు: ఈసీ
[ 18-05-2024]
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
[ 18-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే