అంటకాగిన వారిపై వేటు
పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు చెప్పిందే వేదంగా అమలు చేసిన ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
మిగిలిన వారిలో మార్పు వస్తుందా?
పల్నాడులో పోలీసుల బదిలీపై చర్చ
ఈనాడు, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు చెప్పిందే వేదంగా అమలు చేసిన ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మాచర్ల పట్టణ సీఐ శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా అధికారపార్టీ నేతలతో అంటకాగడంతో ఎన్నికల సంఘానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వరుస ఫిర్యాదులతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ సూచించింది. ఇది పల్నాడు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారపార్టీతో అంటకాగే పోలీసు అధికారుల్లో మార్పు వస్తుందా? స్వామిభక్తి నుంచి బయటపడి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అన్న విషయమై చర్చ జరుగుతోంది. జిల్లాలో అధికారపార్టీతో అంటకాగుతున్న పోలీసు అధికారులు పలువురు ఉన్నారు. ఎలాగైనా వైకాపాను గెలిపించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు.
- జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో పనిచేస్తున్న డివిజన్స్థాయి పోలీసు అధికారి అధికారపార్టీ ఏం చెబితే అది అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలన్న ధోరణితో పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార పార్టీకి అంటకాగుతూ ప్రతిపక్షాలు రోటీన్గా చేసుకునే వాటిని కూడా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా నాయకులు ఏంచేసినా ఇక్కడ చెల్లుబాటు అవుతుండగా ప్రతిపక్షాలు గీత దాటకముందే కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈవిషయాన్ని అనేక సందర్భాల్లో డివిజన్ స్థాయి పోలీసు అధికారి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పలు అక్రమ కేసులు నమోదు చేయించడంలో కీలకపాత్ర పోషించారు.
- పల్నాడు సబ్డివిజన్లో పనిచేస్తున్న ఒకపట్టణ సీఐ, ఎస్సై పూర్తిగా అధికార పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం వీరిద్దరూ ఎంతకైనా దిగజారడం పోలీసు వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక ఎస్సై ప్రతిపక్షనేతలపై ప్రత్యేక నిఘా పెట్టి వారి కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా నేతల ఆదేశాలతో ఎక్కడిదాకా అయినా వెళ్తారన్న పేరుంది. ఇదే సబ్డివిజన్లో మరో పట్టణంలో ఒకే స్టేషన్లో పనిచేస్తున్న సీఐ, ఎస్సై కూడా అధికారపార్టీతో అంటకాగుతున్నారు.
- పల్నాడులో ఆర్థిక వ్యవహారాలకు కేంద్రంగా ఉన్న మండలంలో పనిచేస్తున్న ఎస్సై ఒకరు పరిధి దాటి ప్రవరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు అవసరమైన పనులు చేయడంతోపాటు సొంతజేబు నింపుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎస్సై స్థాయిని కూడా మరిచి రెచ్చిపోతున్నారు. స్టేషన్కు వెళ్లే ప్రజలతో సదరు ఎస్సై ప్రవర్తించే తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా? అన్న అనుమానం కలుగుతుందని వాపోతున్నారు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నా ప్రవర్తనలో మార్పు లేకపోవడం గమనార్హం.
ఇలాగైతే ప్రశాంత ఎన్నికలు ఎలా?
పల్నాడు జిల్లాలో అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు ప్రతిపక్షాలపై దాడులు చేసినా బాధితులపైనే కేసులు పెట్టడం ఇక్కడి సంస్కృతి అన్న భావనకు ఇప్పటికైనా తెరదించాలి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపించిన తరుణంలో పల్లెల్లో రాజకీయ వేడి ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటినుంచి నిర్మాణాత్మకంగా, నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేయాల్సి ఉంది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో సీఐ, ఎస్సై ఒకరు అధికారపార్టీ నేతలు చెప్పిందే చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారి మారిన జిల్లా పోలీసు కార్యాలయంలో కొన్ని విభాగాల్లో కొన్ని నెలల నుంచి పనిచేస్తున్న అధికారుల సాయంతో క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పోలీసు యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం పరిధిలో ఉండటం, జరిగిన సంఘటనల ఆధారంగా నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు పారదర్శకంగా పనిచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి. వీరభక్తులుగా ఉన్న మరో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడితే మిగిలిన వారు ఎక్కడికక్కడ సర్దుకుంటారన్న భావన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు