‘సొంత చెల్లెలిపైనే జగన్ వ్యతిరేక పోస్టులు పెట్టించారు’
‘మద్య నిషేధం చేస్తాం, రాజధాని కడతాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు పింఛను ఇస్తాం,
నాదెండ్ల మనోహర్తో హైపర్ ఆది
తెనాలి టౌన్, న్యూస్టుడే: ‘మద్య నిషేధం చేస్తాం, రాజధాని కడతాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు పింఛను ఇస్తాం, సీపీఎస్ రద్దు చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. ఈ మాటలన్నీ చెప్పి ప్రజలను మోసం చేసిందెవరో మీకు తెలుసు, నేను వృత్తిపరంగా కమేడియన్ మాత్రమేనని వారి మాదిరిగా రియల్ కమెడియన్ కాదని జనసేన పార్టీ ప్రచారకర్త, సినీ,టీవీ నటుడు హైపర్ ఆది పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తనపై వైకాపా సోషల్ మీడియా వారు రకరకాలుగా పోస్టింగ్లు పెట్టారని, ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయంలేదని.. ఎందుకంటే సీఎం జగన్ సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరితే వెంటనే ఆమెపై వ్యతిరేక పోస్టింగ్లు మొదలవటాన్ని మనమంతా చూశామన్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రశ్నించిన వారిపై దాడులు చేయటం, వేధించటం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్కల్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించారని, మనం ఆయన పేరును మార్చి పిలవవచ్చని.. ఎందుకంటే అక్కడ బంపర్ మెజారిటీతో పవన్ గెలవబోతున్నారని పేర్కొన్నారు. ఈ మారు రాష్ట్రంలో కూటమిదే అధికారమని చెప్పారు. మా నాయకుడు పవన్కల్యాణ్కు చిరంజీవి ఎంతో, నాదెండ్ల మనోహర్ కూడా అంతేనని, అంతగా గౌరవిస్తారని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్ర సభాపతిగా ఎందో హూందాగా ఆయన సభను నడిపారని, ఇటువంటి విజనరీ నాయకులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని వివరించారు. తాను విజయవాడ నుంచి తెనాలి వస్తూ ఆ రోడ్డును చూసి భయపడ్డానని, ఒక గర్భిణీ ఆటోలో వైద్యశాలకు ఈ మార్గంలో నుంచి వెళితే ప్రసవం అయిపోయేలా ఉందని వ్యాఖ్యానించారు. తొలుత హైపర్ ఆది మనోహర్ను కలిశారు. అనంతరం తెనాలి మండలంలోని గ్రామాల్లో మనోహర్ను గెలిపించాలని, గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్