బలోపేతమన్నావు.. బలిపీఠమెక్కించావు
పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారువైకాపా ప్రభుత్వం పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. మా గ్రామంలో 40 మంది వాలంటీర్లు ఉన్నారు.
విధుల్లేక తల్లడిల్లిన సర్పంచులు
ఆర్థిక సంఘ నిధులు మళ్లించిన జగన్
పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారువైకాపా ప్రభుత్వం పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. మా గ్రామంలో 40 మంది వాలంటీర్లు ఉన్నారు. వారికి నెలకు రూ.2లక్షలు చొప్పున ఏడాదికి రూ.24లక్షల వంతున వేతనాల కింద ఖర్చు పెడుతున్నారు. కనీసం ఆ మొత్తం (రూ.24 లక్షలు) కూడా మా గ్రామానికి మంజూరు చేయ లేదు. అంటే వాలంటీర్ల పాటి ప్రాధాన్యత కూడా పంచాయతీకి ఇవ్వలేదు. తెదేపా హయాంలో చెత్త సేకరణ, నిర్వహణకు క్లాప్ మిత్రల వేతనాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చెల్లించేది. వైకాపా పాలనలో వారి వేతనాలను పంచాయతీలే చెల్లించుకోవాలని చెప్పారు. నిధుల్లేని పరిస్థితుల్లో చివరకు చెత్త సేకరణ, వాటి నిర్వహణ కూడా పంచాయతీలు చేసే పరిస్థితి లేకుండా పోయింది.
- బి.ప్రసాద్, సర్పంచి, కఠెవరం గ్రామం, తెనాలి మండలం
మేము అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం. పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో తలెత్తుకునేలా చేస్తాం.
-ఇదీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట.
పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ పంచాయతీలో పరిసరాలు పరిశుభ్రపర్చడానికి సూమారు 15 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులకు 6 నెలల నుంచి పంచాయతీ అధికారులు వేతనాలు అందించడం లేదు. దీంతో పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిలో కొన్ని విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. నిధులు లేకపోవడంతో దీపాలు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడం గమనార్హం.
జగన్ చెప్పిన మాటలకు.. చేసిన పనులకు పొంతన లేదు. మాట తప్పారు. పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా నిధులు మంజూరు చేయలేదు సరి కదా.. కేంద్రం అందించే ఆర్థిక సంఘ నిధులను కూడా దారి మళ్లించారు. పలుమార్లు ప్రత్యక్ష ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. సమస్యలు వినకపోగా పైపెచ్చు అరెస్టులు చేసి వారిని ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఐదేళ్లుగా ఆత్మగౌరవం దెబ్బతిని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిధులు లేవు.. విధులు లేవు.. గౌరవం లేదు.. నమ్ముకుని ఎన్నుకున్న ప్రజలకు ముఖం చాటేయాల్సిన దుస్థితి. ఇదీ జగనన్న పాలనలో స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పరిస్థితి. కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు తగిన గౌరవం లభించక వారు కార్యాలయానికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
ఈనాడు-అమరావతి, -న్యూస్టుడే, చేబ్రోలు, పొన్నూరు, తెనాలి
పల్లెవాసులకు ఏ కష్టమొచ్చినా కళ్లెదుట కనిపించే సర్పంచులని అడుగుతారు. చెత్త తీయాలన్నా.. మురుగు కాల్వలు శుభ్రం చేయాలన్నా.. వీధి దీపాలు బాగు చేయాలన్నా.. తాగునీటి సరఫరా.. దోమల మందు పిచికారీ ఇలా ప్రతి పనికి సర్పంచుల వైపు చూస్తారు. తనను నమ్ముకుని ఎన్నుకున్న పల్లె ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తున్న సర్పంచులు అప్పులు చేసి పనులు చేసినా ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆర్థికంగా కుదేలయ్యారు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు వచ్చే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.
కేంద్రం ఇచ్చినా జమ చేయని రాష్ట్రం
కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినా గ్రామ పంచాయతీలకు సకాలంలో జమ చేయడం లేదు. కొంత సొమ్ము విద్యుత్తు బిల్లుల బకాయిలకు జమ చేసుకోగా మిగిలినది ఖాతాల్లో వేయడం లేదు. జిల్లాకు ప్రతి మూడు నెలలకు ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.9.06 కోట్లు వస్తున్నాయి. వీటి కోసం సర్పంచులు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినా వాటిలో పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్ మిత్రలకు వేతనాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఇవి చెల్లిస్తుండడంతో పల్లె గల్లా పెట్టెలు ఖాళీ అవుతున్నాయి. జిల్లా పరిషత్కు ఐదేళ్లలో ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు, దుకాణాల అద్దె, రేవులు వేలం, భూముల కౌలు, సీనరేజీ రూపంలో ఆదాయం ద్వారా ఐదేళ్లలో సాధారణ నిధులు రూ.50 కోట్లు సమకూరాయి. వీటితో కొన్నిచోట్ల సీసీరోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, తాగునీటి పథకాల మరమ్మతు, పాఠశాల భవనాలు, అతిథిగృహాల మరమ్మతులు చేపట్టారు. ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో ఒక్క పనీ చేయలేదు.
అప్పు చేసి రూ.10 లక్షలు ఖర్చు చేశా
మా గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రెండేళ్ల కిందట రూ.10 లక్షలు అప్పు చేసి వివిధ అభివృద్ధి పనులు చేశా. రోజులు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాలేదు. అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నా. అధికారులు వైకాపా నేతల మాటలు విని ఎటువంటి పనులకు సహకరించడం లేదు. అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు అనేక సమ్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు చేస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నా.
- తోట వీరరాఘవమ్మ, నారాకోడూరు సర్పంచి
రూ.30 కోట్ల వరకు బకాయిలు..
గ్రామ పంచాయతీలకు ఆయా గ్రామాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి పంచాయతీల వాటా జమ చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో మైనింగ్ సెస్ జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటిని పంచాయతీలకు జమ చేయకపోవడంతో నిధుల లభ్యత తగ్గింది.
గ్రీన్ అంబాసిడర్లకు జీతాలేవీ..
గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి నెలకు రూ.6వేలు చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం, చెత్త నుంచి సంపద సృష్టించే పనులు వీరితో చేయిస్తున్నారు. వీరికి స్వచ్ఛభారత్ మిషన్ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అవి రాకపోవడంతో సర్పంచులు సొంత జేబు నుంచి చెల్లించి వారు విధులకు వచ్చేలా చూస్తున్నారు.
గౌరవం లేక ముఖం చాటేస్తున్న ప్రజాప్రతినిధులు
గ్రామాల్లో గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత సర్పంచుల ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయింది. వాస్తవం చెప్పాలంటే సర్పంచి లేకుండానే పాలన సాగిపోతోంది. ఉద్యోగులందరూ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పని చేస్తుండడం, సర్పంచులకు ప్రత్యేకమైన విధులు లేకపోవడంతో ప్రాధాన్యం తగ్గింది. సర్పంచుల పరిస్థితి ఇలా ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వారికి ప్రత్యేకంగా కార్యాలయాలు లేకపోవడం, నిధులు కూడా వారి పరిధిలో లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఎంతో ఆసక్తితో ప్రజలకు సేవ చేయడానికి వస్తే ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్