Ts News: 7 వర్సిటీల్లో పీజీ కన్వీనర్ కోటా మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి
తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాల్లోని సంప్రదాయ పీజీ కోర్సుల్లో మొదటి విడత సీట్లు కేటాయించారు. మొదటి విడతలో 23,647 సీట్లు కేటాయించగా.. మరో 24,278 మిగిలాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూల్లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలకు...
హైదరాబాద్: తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాల్లోని సంప్రదాయ పీజీ కోర్సుల్లో మొదటి విడత సీట్లు కేటాయించారు. మొదటి విడతలో 23,647 సీట్లు కేటాయించగా.. మరో 24,278 మిగిలాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూల్లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలకు ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. 7 వర్సిటీల్లో కలిపి కన్వీనర్ కోటాలో 47,925 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్లో ఉత్తీర్ణులైన 32,400 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. మొదటి విడతలో 23,647 మందికి సీట్లు దక్కాయి. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 10 వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. వచ్చిన సీటుతో సంతృప్తి చెందితే కాలేజీలో చేరాలని.. లేదంటే రెండో విడత కోసం వేచి చూడవచ్చునన్నారు. కళాశాలల్లో చేరాలనుకొనే అభ్యర్థులు టీసీ మాత్రమే ఒరిజినల్ ఇవ్వాలని.. విద్యార్హత ధ్రువపత్రాలు ఒరిజినల్ ఇవ్వకూడదన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని కళాశాలల యాజమాన్యాలకు కన్వీనర్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక