అన్నదాతకు.. అందని ‘సహకారం’
జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లో రైతులు రుణాలకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల విలీనంతో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఎస్బీహెచ్ సౌజన్యంతో సంఘాలు
ఏడాదిగా నిలిచిన రుణ పంపిణీ
న్యూస్టుడే, పెద్దేముల్: జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లో రైతులు రుణాలకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల విలీనంతో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఎస్బీహెచ్ సౌజన్యంతో సంఘాలు కొనసాగాయి. ప్రస్తుతం ఎస్బీఐలో విలీనం కావడంతో అన్నదాతలకు అవస్థలు మొదలయ్యాయి. రుణ ప్రణాళిక రూపొందించినా ఆమోదం లభించని పరిస్థితి. దీంతో పలు సంఘాలు ఖరీఫ్, రబీకి రుణాలు ఇవ్వడంలేదు. కేవలం పునరుద్ధరించి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. దీంతో సంఘం నుంచి బయటికి వచ్చి వాణిజ్య బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. సహకార సంఘాల్లో సభ్యత్వం వదులుకుని చాలా మంది ఇతర బ్యాంకుల్లో రుణం తీసుకుంటున్నారు.
జిల్లాలో కొత్తగడి, ఎక్ మామిడి, పూడూరు, హరిదాన్ పల్లి ప్రాథమిక సహకార సంఘాలు, పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం సుమారు 40 ఏళ్లగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కొనసాగాయి. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా లావాదేవీలు జరిగేవి. ఏటా రుణ ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించే వారు. దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించి రుణాలు ఇచ్చే వారు. బ్యాంకుల విలీనంతో పరిస్థితి మారింది. ఎస్బీఐ అధికారులు రుణాలు ఇవ్వడం నిలిపివేశారు. నిధుల కోసం సహకార సంఘాలు ఏడాదిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు చిల్లిగవ్వ విదల్చలేదు. కొత్తగడి సోసైటీలో 850 మంది రైతులకు రూ.7 కోట్లు, ఎక్ మామిడిలో 686 మందికి రూ.4.5 కోట్లు, హరిదాన్ పల్లిలో 530 మందికి రూ.3 కోట్లు, పెద్దేముల్లో 2800 మందికి రూ.3 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చేందుకు అప్పుల కోసం బ్యాంకులకు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 4,866 మంది రైతులకు రూ.14.5 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది.
డీసీసీబీలో కలుపాలని తీర్మానాలు: చాలా మంది రైతులు అప్పులు చెల్లించి ఇతర బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులతో కళకళలాడాల్సిన సహకార సంఘాల భవనాలు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది జీతాలు చెల్లించలేని స్థితి నెలకొంది. వడ్డీలు కట్టుకుని ఖాతాలను రెన్యూవల్ చేస్తున్నారు. రుణమాఫీకి చాలా మంది అన్నదాతలు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అనువుగా లేకపోవడంతో ప్రాథమిక సహకార సంఘాలు, పెద్దేముల్ రైతు సహకార సంఘం డీసీసీబీలో విలీనం చేయాలని తీర్మానాలు చేశారు.
సిబ్బందికి జీతాలు ఇవ్వలేక..: పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం 1977లో ఏర్పాటు చేశారు. 22 గ్రామాలకు చెందిన 6 వేలకు పైగా రైతులు సభ్యత్వం పొందారు. అన్నదాతలకు అన్ని రకాల రుణాలను అందజేశారు. ఎరువులు, విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. చేనేత, ఫౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించారు. ఇలా 25 ఏళ్ల పాటు వివిధ రకాల తోడ్పాటును అందిస్తూ కళకళలాడింది. లాభాలు రావడంతో సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు. ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రైతుల రాకపోకలు లేక వెలవెలబోతోంది.
బ్యాంకు నుంచి సరైన స్పందన లేదు: విష్ణువర్ధన్రెడ్డి, ఛైర్మన్, పెద్దేముల్ సొసైటీ
సంఘం సమావేశాల్లో, సర్వసభ్య సమావేశాల్లో రుణాల కోసం తీర్మానాలు చేశాం. బ్యాంకుల విలీనంతో మేనేజింగ్ డైరెక్టర్ ను తొలగించారు. రూ.3 కోట్ల రుణానికి ప్రతిపాదనలు పంపించినా స్పందన లేదు. డీసీసీబీలో విలీనం చేయాలని తీర్మానం చేశాం. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రుణాలు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. తక్షణం బ్యాంకు అధికారులు స్పందించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.