Sitaram Yechury: దేశంలో సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరం: సీతారాం ఏచూరి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విగ్రహాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం  జైపాల్‌రెడ్డితో ఆయనకున్న అనుంబంధాన్ని ఏచూరి పంచుకున్నారు. 

Updated : 30 Sep 2022 15:22 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏచూరి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలో జైపాల్‌రెడ్డి, తాను మొదటిసారిగా కలుసుకున్నామని, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఇద్దరూ కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. ఏ సిద్ధాంతాల ఆధారంగా జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారో.. అవి ఇప్పటి రాజకీయాల్లో లోపించాయన్నారు. చివరి వరకు విలువలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు జైపాల్ రెడ్డి అని.. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటని అన్నారు. దేశంలో విచ్ఛిన్న శక్తులు రాజ్యమేలుతున్నాయని.. వాటి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం మళ్లీ సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని సీతారాం ఏచూరి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని