Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
దళిత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆరోపించారు. తొలి దళిత సీఎం మొదలు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)కు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. భారాస(BRS) పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.20,857 కోట్ల రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు.
దళిత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తొలి దళిత సీఎం మొదలు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరొకసారి వంచించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే నీరు కార్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60వేల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమేనన్న రేవంత్.. ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 60 నుంచి 70ఏళ్లకు కూడా పూర్తి కాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గడిచిన తొమ్మిది ఏళ్లుగా భారాస పార్టీ ప్రజలను ఊరిస్తేనే ఉందని విమర్శించారు. సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. గత బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకానికి ఇంతవరకు మార్గదర్శకాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న మాటలు వట్టి బూటకమని విమర్శించారు. గృహ వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్