కేవైసీ పేరిట మున్సిపల్ ఉద్యోగికి టోకరా
కేవైసీ పేరుతో మున్సిపల్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్గూడ సమీపంలోని జవహర్నగర్లో నివసించే మున్సిపల్ ఉద్యోగి ఆర్.శ్రీధర్రావు...
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: కేవైసీ పేరుతో మున్సిపల్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్గూడ సమీపంలోని జవహర్నగర్లో నివసించే మున్సిపల్ ఉద్యోగి ఆర్.శ్రీధర్రావు చరవాణికి ఈనెల 6న బ్యాంకు ఖాతాకు సంబంధించి పాన్ కార్డు నవీకరణతోపాటు కేవైసీ చేసుకోవాలంటూ సంక్షిప్త సందేశం వచ్చింది. దీంతో లింకును తెరిచి వివరాలు పొందుపరిచి, వచ్చిన ఓటీపీని నమోదు చేశారు. దీంతో ఖాతా నుంచి రూ.39,999 విత్డ్రా అయినట్లు సందేశం వచ్చింది. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి