Congress: తెలంగాణకు కొత్తగా ఇద్దరు ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కొత్తగా ఇద్దరు ఇన్ఛార్జి కార్యదర్శులను నియమించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇద్దరు ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మన్సూర్ అలీఖాన్, కేరళకు చెందిన పీసీ విష్ణునాథ్లను రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జిలుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. ఇప్పటి వరకు ఏఐసీసీ కార్యదర్శిగా ఉంటున్న నదీం జావిద్ను బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించింది. అదేవిధంగా ఇటీవల కర్ణాటక మంత్రిగా నియమితులైన బోసురాజును కూడా బాధ్యతలను నుంచి తప్పించింది. వారిద్దరి స్థానంలో కర్ణాటకకు చెందిన మన్సూర్ అలీఖాన్, కేరళకు చెందిన విష్ణునాథ్లను నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.