Hyderabad Metro Rail: మెట్రో బ్రేకేస్తే విద్యుదుత్పత్తి
మెట్రోరైలు కరెంట్ వాడుకోవడమే కాదు అందులో సగం తిరిగి ఉత్పత్తి చేస్తోంది. మెట్రోలో రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. మెట్రోరైళ్లు నడిచేందుకు కావాల్సిన ట్రాక్షన్ విద్యుత్తులో 40 శాతం బ్రేకింగ్ ద్వారానే తయారవుతోంది.
గత ఆర్థిక సంవత్సరంలో 36 మిలియన్ యూనిట్ల పునర్వినియోగం
ఈనాడు, హైదరాబాద్
మెట్రోరైలు కరెంట్ వాడుకోవడమే కాదు అందులో సగం తిరిగి ఉత్పత్తి చేస్తోంది. మెట్రోలో రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. మెట్రోరైళ్లు నడిచేందుకు కావాల్సిన ట్రాక్షన్ విద్యుత్తులో 40 శాతం బ్రేకింగ్ ద్వారానే తయారవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 36 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మెట్రో బ్రేకింగ్తో ఉత్పత్తి చేసింది. ఇది హైదరాబాద్లో సగం ప్రాంతానికి ఒకరోజు సరఫరాకు సమానం. 6500 ఇళ్లకు ఏడాదిపాటూ సరిపడే విద్యుత్తు.
11 మిలియన్ యూనిట్లు..
మెట్రోరైలుకు చెందిన రెండు డిపోలు, 28 స్టేషన్లపై సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటి సామర్ధ్యం 8.35 మెగావాట్లు. కొత్తగా మరో 5.5 మెగావాట్ల సౌర విద్యుత్తు ఫలకలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ప్లాంట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 11 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. మెట్రో మొత్తం కరెంట్ వినియోగంలో ఇది పది శాతం.
1750 చెట్లతో సమానం..
మెట్రోలో ప్రయాణించడం ద్వారా గత ఆర్థిక సంవత్సంలో వాతావరణంలో కలిసే కార్బన్ డై యాక్సైడ్ 88 మిలియన్ కిలోలు ఉత్పత్తి కాకుండా చేయగలిగారు. ఇది 1750 చెట్లతో సమానం. 28 మిలయన్ లీటర్ల పెట్రోలు, డీజిల్ ఆదా అయ్యింది. 2040 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా శాతానికి తేవాలనేది ఎల్అండ్టీ లక్ష్యం.
ఎక్కువ ప్రయాణిస్తే మరింత ప్రయోజనం
మెట్రోలో ఏడాది కాలంలో సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తే పర్యావరణపరంగా అనేక ప్రయోజనాలున్నాయని, ట్రాఫిక్ తగ్గాలన్నా.. కాలుష్యం హద్దులు దాటొద్దన్నా ఈ సంఖ్య మరింత పెరగాలని గతంలో మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో 15 లక్షల మంది మెట్రోలో రాకపోకలకు అవకాశం ఉందని తెలిపారు.
* నగరం నివాసయోగ్యంగా ఉండాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలి. అవకాశం ఉన్న చోట ప్రజారవాణాను ఉపయోగించాలి. వారంలో ఒకరోజు వాహనాన్ని వదిలి ప్రయాణించేలా అలవాటు చేసుకోవాలి.
* ప్రజారవాణా వాడకం పెరగాలంటే ప్రయాణికుడు గమ్యస్థానం దాకా చేర్చే నమ్మదగిన ప్రయాణ వ్యవస్థను పెంపొందించాలి. ః మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటో, క్యాబ్లన్నింటినిలో చెల్లుబాటు అయ్యేలా కామన్ మొబిలిటీ స్మార్ట్కార్డు అందుబాటులోకి రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్