Ganesh Nimajjanam: మహానిమజ్జనం.. సర్వం సిద్ధం
లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. గురువారం పదకొండో రోజు జరగనున్న నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలు సిద్ధమయ్యాయి.
నెక్లెస్రోడ్డులో కరిముఖుడికి వీడ్కోలు పలుకుతుండగా చరవాణుల్లో బంధిస్తున్న యువత
ఈనాడు, హైదరాబాద్: లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. గురువారం పదకొండో రోజు జరగనున్న నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఇతరత్రా కలిపి మరో 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయని, అన్ని ప్రాంతాల్లో క్రేన్లు, ఇతర యంత్రాలు, సిబ్బందికి విధులు కేటాయించామని జీహెచ్ఎంసీ తెలిపింది. శోభాయాత్ర జరిగే రహదారుల పొడవునా పారిశుద్ధ్య కార్యక్రమాలు, బారికేడ్లు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. భక్తులు, నిమజ్జన సిబ్బంది, కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు నీళ్లలో పడితే.. వారిని వేగంగా రక్షించేందుకు నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. సాగర్ చుట్టూ, పలు రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపకశాఖ వాహనాలు అందుబాటులో ఉంచారు. జలమండలి పది లక్షల నీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచనుంది.
40 వేల మంది సిబ్బందితో అసాధారణ భద్రత
ప్రతిష్ఠాత్మక గణేశ్ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధాని నగరంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కలిపి రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,694 మంది విధుల్లో పాల్గొంటున్నారు. 125 ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్ఏఎఫ్, పారా మిలిటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. సైబరాబాద్, రాచకొండలో కలిపి 13 వేల మంది గస్తీలో పాల్గొననున్నారు. దాదాపు 48 గంటలపాటు సాగే ఉరేగింపు, నిమజ్జనంలో 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ముగ్గురు కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జనం జరిగే ప్రాంతాల్ని నేరుగా సందర్శించి భద్రతను సమీక్షించారు. రూట్మ్యాప్ ఖరారు చేశారు.
సున్నిత పరిస్థితుల నేపథ్యంలో..
నగర పోలీసు చరిత్రలో అత్యంత సున్నితమైన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ 35 ఏళ్ల తర్వాత ఈసారి ఒకే రోజు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ముస్లిం మత పెద్దలతో మాట్లాడి మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఒకటో తేదీకి వాయిదా వేయించారు. కొందరు మాత్రం అదే రోజు జరపాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి సున్నితమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మూడు కమిషనరేట్లలోనూ అసాధారణ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులు నేరుగా విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన ఇనుప జాలీ
వార్రూమ్.. కమాండ్ కంట్రోల్
హైదరాబాద్ పోలీసులు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని వార్రూమ్ ద్వారా కీలక ప్రాంతాల్ని గమనించేలా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకూ 19 కిలోమీటర్లు సాగే ఊరేగింపు మార్గాల్లోని ప్రధాన ప్రాంతాలన్నీ నిఘా కెమెరాల నీడలో ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్కు 3,600 సీసీ కెమెరాలు అనుసంధానించారు. సైబరాబాద్లో 6 వేల కెమెరాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించే వ్యవస్థ ఉంది. వీటికి అదనంగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. జీహెచ్ఎంసీ, పోలీసుల అంచనా ప్రకారం ఈ సారి సుమారు 1.20 లక్షలకుపైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశముంది.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్- హుస్సేన్సాగర్ మార్గంలో ఏర్పాట్లు, భద్రతను సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. పర్యటనలో నగర అదనపు పోలీస్ కమిషనర్లు విక్రమ్ సింగ్ మాన్, సుధీర్బాబు, విశ్వప్రసాద్, డీసీపీలు సాయిచైతన్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక బస్సులు.. అర్ధరాత్రి వరకూ మెట్రో
- ఆర్టీసీ నగరం నలుమూలల నుంచి హుస్సేన్సాగర్కు 535 బస్సులు నడుపుతోంది.
- భక్తుల కోసం రాత్రి వరకూ, 29 వేకువజామున ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
- గురువారం అర్ధరాత్రి దాటి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుపుతున్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో ఇందు కోసం అదనపు సిబ్బందిని నియమించారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి
మాట్లాడుతున్న భగవంతరావు, చిత్రంలో హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు
సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు
అబిడ్స్, న్యూస్టుడే: వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక నిమజ్జనంలో డీజేలకు బదులు భక్తి గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగాలని కోరారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు మాట్లాడుతూ.. నిమజ్జనం వేడుకలను ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రం కోరిందన్నారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
తరలించే వాహనాలు సిద్ధం
మహా గణపతులను గంగ ఒడికి చేర్చేందుకు వినియోగించేందుకు వాడే అతి భారీ ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. 250 టస్కర్లు (16 టైర్లతో కూడుకున్నవి), మరో 2 వేల ఇతర వాహనాలు అందిచనున్నట్లు హైదరాబాద్ జిల్లా సంయుక్త రవాణాశాఖ కమిషనర్ పాండురంగనాయక్ తెలిపారు. వీటిని బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
[ 02-05-2024]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ను హైదరాబాద్లోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించారు. -
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
[ 02-05-2024]
నాంపల్లికి చెందిన కిర్పాన్ కౌర్ ఖనూజా అబిడ్స్ స్లేట్ ది స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తల్లి అస్మిత్కౌర్ కలిసి ఇంటికెళ్తుండగా.. ఓ యువకుడు అడ్డొచ్చాడు. అదుపుతప్పి తల్లీకూతురు కిందపడ్డారు. -
హస్తం చెంతకా.. కమలం గూటికా?
[ 02-05-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భాజపా, కాంగ్రెస్లు గులాబీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి పోటీపడుతున్నాయి. -
వారి ఓటును వారికి వేసుకోలేరు
[ 02-05-2024]
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. -
కొత్త ఓటరు కార్డులు లేనట్టేనా ?
[ 02-05-2024]
కొత్త ఓటర్లకు ఈసారి గుర్తింపు కార్డులు లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్కు మిగిలింది పది రోజులే. అయినా ఎన్నికల సంఘం ఇంకా ముద్రణ ప్రారంభించలేదనే విమర్శలొస్తున్నాయి. -
రూ.2.95 కోట్ల నగదు స్వాధీనం
[ 02-05-2024]
సరైన పత్రాల్లేకుండా బ్యాంకులకు తరలిస్తున్న రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. -
అక్కడ.. పోలింగ్ సిబ్బంది అందరూ మహిళలే
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
ఐదొందలిస్తే అదనపు సేవ
[ 02-05-2024]
వైద్యులు ధ్రువీకరించినా.. రూ.500 ఇస్తేనే మీకు పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరణ ఇస్తామంటూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కొన్ని మీసేవ కేంద్రాలు, కొందరు జీహెచ్ఎంసీ అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల జారీని అవినీతిమయం చేశారు. -
ఓటరు చీటీలు మేమే ఇస్తాం
[ 02-05-2024]
నగరంలో ఓటరు చీటీల పంపిణీ గందరగోళంగా మారింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో నేతల చేతుల్లోకి వెళ్లింది. -
ప్రచారానికి రండి.. సదుపాయాలు దండి
[ 02-05-2024]
అయ్యా! పనివాళ్లు దొరకడంలేదు. నలుగురిని పిలుస్తుంటే ఒక్కరే వస్తున్నారు. అందరూ ప్రచారానికి వెళ్లిపోతున్నారు. యజమాని..: కూలీ కంటే డబ్బులు ఎక్కువ వస్తాయా..? -
మేయర్ ఇంట్లో చొరబడిన అగంతకుడు
[ 02-05-2024]
మేయర్ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు. -
చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
[ 02-05-2024]
చిన్నారుల్లో అరుదుగా వచ్చే కాలేయ క్యాన్సర్కు చికిత్స చేసి అరుదైన ఘనత సాధించారు నిమ్స్ వైద్యులు. ఆస్పత్రి డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ సర్జన్ నగరి బీరప్ప చికిత్స చేశారు. -
అమ్మాయిలా నటిస్తూ.. నగ్నచిత్రాలు పంపుతూ..
[ 02-05-2024]
బెట్టింగ్కు అలవాటుపడ్డ కుర్రాడు.. నేరస్థుడి అవతారమెత్తాడు. డేటింగ్ యాప్లో అమ్మాయిలా నటించి మోసగిస్తున్న అతడ్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
బోను వద్దకు వెళ్లి మేకను వదిలేసిన చిరుత
[ 02-05-2024]
విమానాశ్రయం రన్వే మైదానంలోకి నాలుగు రోజుల క్రితం చొరబడిన చిరుత మంగళవారం రాత్రి 10.57 గంటలకు ఓ బోను వద్దకు వచ్చింది. అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. -
ఓటర్లను మభ్యపెట్టడానికే భాజపాపై దుష్ప్రచారం
[ 02-05-2024]
ఆరు గ్యారంటీ పథకాల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ మండిపడ్డారు. -
ఠాణాకు చేరిన మైనర్ల ప్రేమ
[ 02-05-2024]
ఆ బాలికకు పదిహేనేళ్లు నిండలేదు. అబ్బాయికీ 18 లోపే. వీరి మధ్య చిగురించిన ప్రేమ గర్భం వరకు వెళ్లడంతో పెద్దలకు తెలిస్తే తిడతారని ఆ బాలుడు బాలికకు గర్భవిచ్ఛిత్తి మాత్రలు వేయించాడని తెలిసింది. -
సీఎంపై ఓయూ పీఎస్లో ఫిర్యాదు
[ 02-05-2024]
ఓయూ సెలవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ భాష సంస్కారవంతమైంది
[ 02-05-2024]
తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు -
నిమ్స్ కార్మికులకు అండగా ఉంటా
[ 02-05-2024]
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటానని ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ డేగ కళ్లు
[ 02-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటోంది. -
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
[ 02-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్లో చేరారు. -
కోడ్ ముగిశాక హామీలన్నీ అమలు
[ 02-05-2024]
ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేశామని, మిగిలిన వాటినీ ఎన్నికల కోడ్ ముగిశాక తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!