TS News: త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి
రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో నలుగురైదుగురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు.
ప్రత్యర్థి పార్టీల్లో కీలక నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో నలుగురైదుగురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. వీరి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాట తీసుకుందని చెబుతున్నారు. మరికొందరు భారాస నేతలు హస్తం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారు. భారాస నుంచి చేరిన వారిలో ఆర్థికంగా ఉన్న వారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి అనుగుణంగా మంగళవారం దిల్లీలో జరిగే కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. బహుశా అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు తెలిపారు.
పదవులు.. హామీలు..
గ్రేటర్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్ గెలిచింది. దీంతో సిటీలోని నాలుగు ఎంపీ స్థానాలను గెలవాలని సీఎం రేవంత్రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల మీట్ది ప్రెస్లోనూ ఆయన వెల్లడించారు. ‘‘గ్రేటర్ పరిధిలో అన్ని స్థానాల్లో విజయం సాధించడానికి మా వ్యూహాలు మాకున్నాయి...మీరే చూడండి’’ అని సీఎం అన్నారు. ఆయన మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నగరం పరిధిలో పట్టున్న ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను వేగం చేసింది. కొందరికి పదవులు ఆశ చూపుతున్నారు.. మరికొందరికి హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్లో చేరిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మరో ఇద్దరు మాజీమంత్రులు, మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు, తొలిసారి గెలిచిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరిని ఎన్నికల నోటిఫికేషన్ లోపు పార్టీలో చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అభ్యర్థిత్వాలపై అవగాహనకు..
గ్రేటర్లోని నాలుగు స్థానాలకు గాను మూడింటిలో అభ్యర్థుల విషయంపై అవగాహనకు వచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్రెడ్డిని పోటీకి నిలపాలని తొలుత భావించినా.. భారాస ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆయనే బరిలో నిలిచే అవకాశాలున్నాయి. సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో నిలపాలని భావించారు. కానీ ఇక్కడా వ్యూహాన్ని మార్చాలని అనుకుంటున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరితే ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. భద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థిస్తున్నారని చెబుతున్నారు.ఇటీవల మల్లారెడ్డి డీకేను కలిసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను బరిలో నిలపాలని తొలుత అనుకున్నారు. రాష్ట్రంలో తూర్పుకాపు వర్గాన్ని సంతృప్తి పర్చడం కోసం అదే వర్గానికి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను బరిలో నిలపాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికే చెందిన వ్యక్తిని బరిలో నిలిపే అవకాశం ఉంది.
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం