logo

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

మనవరాలిని చూసేందుకు నగరానికి వచ్చిన తాతయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ రాణా పరిధిలో జరిగింది.

Published : 28 Mar 2024 20:50 IST

కాప్రా: మనవరాలిని చూసేందుకు నగరానికి వచ్చిన తాతయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ రాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ షేక్ షఫీ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసుముద్రం మండలం ధనసరి గ్రామానికి చెందిన బండారపు సారయ్య (61) రైతు. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు. అతడి కుమారుడు బండారపు సౌంధిత్ కుషాయిగూడలోని వాసవీశివానగర్‌లో ఉంటున్నాడు. నగరంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అతడికి ఏడాదిన్న కుమార్తె ఉంది. మనవరాలిని చూసేందుకు సాయర్య భార్య సుజాతతో కలిసి అయిదు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. కొడుకు ఇంట్లో ఉంటున్న అతడు గురువారం తెల్లవారు జాము అయిదు గంటల ప్రాంతంలో ఉదయపు నడకని బయటకు వచ్చాడు. నాగార్జునగర్ కాలనీ నుంచి డీమార్ట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న అతడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన జీహెచ్ఎంసీకి చెందిన ఆటో ఢీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు సౌంధిత్ ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని