ప్రజల కోసమే యాగం: ప్రసాద్కుమార్
రాష్ట్ర, జిల్లా, వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు.
మహా సుదర్శన హోమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, కూతురు అనన్య, అల్లుడు చేతన్
వికారాబాద్ మున్సిపాలిటీ, న్యూస్టుడే: రాష్ట్ర, జిల్లా, వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూతురు అనన్య, అల్లుడు చేతన్తో కలిసి మహా సుదర్శన హోమం, రాజశ్యామల యాగం, చండీ యాగం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ప్రముఖ వేద పండితులు సుభాష్శర్మ, కార్తీక్శర్మ, రాజీవ్శర్మ, రాఘవేంద్ర శర్మ, సేతురామాచారి ఆధ్వర్యంలో హోమ క్రతువును జరిపించారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. పుర అధ్యక్షురాలు మంజుల, మాజీ పుర అధ్యక్షుడు వి.సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రమేశ్కుమార్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!