logo

కాంగ్రెస్‌లో చేరిన గ్రేటర్‌ హైదర్‌బాద్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల

గ్రేటర్‌ హైదరాబాద్‌ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Published : 03 May 2024 03:33 IST

దీపాదాస్‌ మున్షి, సీఎం రేవంత్‌రెడ్డితో శ్రీనివాస్‌యాదవ్‌

రెజిమెంటల్‌బజార్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సీఎం ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని, ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తరువాత పార్టీ భ్రష్టుపట్టిందని, కష్టపడి పని చేసేవారికి, ఉద్యమకారులకు స్థానం లేకుండా పోయిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని