ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు.
అధినేతల ఆదేశాలతో కిందిస్థాయి నేతల ఉక్కిరిబిక్కిరి
ప్రతిభ కనబర్చిన వారికి నామినేటెడ్ పదవులంటూ హామీలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాల్లో గెలవాల్సిందేనని ఓ పార్టీ అధినేత ఆదేశిస్తే.. కనీసం మూడింటిలోనైనా పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలంటూ మరో అగ్రనేత కిందిస్థాయి నాయకులకు హుకుం జారీ చేశారు. ఇందుకు ఏం కావాలో చెప్పండి.. సమకూరుస్తామంటూ హామీలు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు, ఇతర ప్రయోజనాలు దక్కే అవకాశం ఉండటంతో నియోజకవర్గ స్థాయి నేతలు తమ పరిధిలో పార్టీ గెలుపునకు ప్రణాళికలు రూపొందించుకుని అందకనుగుణంగా పని చేయడం మొదలుపెట్టారు.
భాజపాకు ది‘షా’నిర్దేశం..
నాలుగు లోక్సభ స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులు గెలవాల్సిందేనంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆ పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో పది రోజులు చేపట్టే కార్యక్రమాలపై కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ నేపథ్యంలో కీలక నేతలతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి చర్చలు జరిపారు. సరికొత్త ప్రణాళిక అమలు చేయాలంటూ నేతలపై బాధ్యతలు మోపారు. ఎమ్మెల్యే రాజాసింగ్తో అమిత్షా మాట్లాడడంతో ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
రంగంలోకి దిగిన సీఎం..
వారం రోజులుగా సీఎం రేవంత్రెడ్డి రాజధాని పరిధిలోని నేతలతో మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల అభ్యర్థుల విజయం కోసం సీఎం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిందిస్థాయి నేతలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించారు. వీరంతా బూత్స్థాయి కార్యకర్తలతో మాట్లాడి.. ప్రతి ఓటరును బూత్ వరకు తీసుకొచ్చి పార్టీకి ఓటేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిభ చూపిన నేతలకు మున్ముందు నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానంను ఎంపిక చేయడాన్ని పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వ్యతిరేకించారు. సీఎం జోక్యంతో ఇప్పుడు ఆమె దానంకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఉపఎన్నికలో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సర్వే సత్యనారాయణ.. కాంగ్రెస్ అగ్రనేతల హామీ మేరకు పార్టీ అభ్యర్థుల ప్రచారంపై దృష్టిపెట్టారు. ఇలానే మరికొందరు నేతలు కూడా ఇప్పుడు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.
అన్నింటా కేటీఆర్నే..
శాసనసభ ఎన్నికల తరవాత కాస్త డీలాపడిన నేతల్లో జవసత్వాలు నింపి ఈ ఎన్నికల్లో విజయం కోసం భారాస అగ్రనేత కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. నగర బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరినా.. ధైర్యం కోల్పోకుండా శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. మరికొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలతో, కార్పొరేటర్లతో కూడా ఆయన మాట్లాడారు. ఈ పది రోజుల్లో చేపట్టాల్సిన ప్రచారం, ఇతరత్రా కార్యక్రమాలు గురించి కూడా నేతలతో చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
[ 17-05-2024]
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ