logo

ప్రాణం తీసిన.. ఫొటో సరదా..

క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన  కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్‌ క్వారీ గుంత వద్ద జరిగింది.

Published : 05 May 2024 03:21 IST

కీసర: క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన  కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్‌ క్వారీ గుంత వద్ద జరిగింది.  సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. సైనిక్‌పురిలోని జెకె కాలనీకి చెందిన మోదుగ గౌతమ్‌రాజ్‌(22) ప్రైవేటు ఉద్యోగి. శనివారం స్నేహితులు అనురుధ్‌,అఖిల్‌తో కలిసి  గుంతలో  ఈత కొట్టేందుకు దిగారు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు దిగుతుండగా గౌతమ్‌రాజ్‌ మునిగి పోయాడు. స్నేహితులు  కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.


రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

చింతపల్లి: లారీ ఓ వృద్ధుడిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మధనపురం గేట్‌ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని పెద్దమాడ్గుల గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మారెడ్డి(78) చింతపల్లి మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ జాతీయ రహదారిపై ఉన్న మధనపురం గేట్‌ వద్ద రోడ్డు పక్కన నిల్చొని ఉన్నాడు. చింతపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి లక్ష్మారెడ్డి బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని