logo

దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణే

దేశంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 May 2024 03:47 IST

కిషన్‌రెడ్డి, సురేష్‌గోపి

కాచిగూడ, న్యూస్‌టుడే: దేశంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో రోడ్‌షో అనంతరం శనివారం రాత్రి కాచిగూడ చౌరస్తాలో బహిరంగ సభలో మాట్లాడారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, కటక్‌ నుంచి ముంబయి వరకు.. దేశంలో ఎక్కడ చూసినా మోదీ పేరే వినిపిస్తోందన్నారు. మలయాళ సినీ నటుడు సురేష్‌గోపి, భాజపా జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, కార్పొరేటర్లు ఉమారాణి, అమృత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని