పజ్జన్న అంటే ప్రజల మనిషని తెలుసు
జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భారాస సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్
జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండు, మూడుస్థానాలకే పరిమితం అంటూ జోస్యం చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజల కోసమే సాగిందని, లోక్సభ ఎంపీగా గెలిచినా జనంలోనే ఉంటానన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పుకొచ్చారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం, జనాల నుంచి వస్తున్న స్పందన, గెలుపునకు దోహదపడే అంశాలపై ‘పజ్జన్న’ పలు విషయాలను పంచుకున్నారిలా...
ఈ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు..? మీ దృష్టిలో వారి బలహీనతలు ఏంటి..?
భారాస, భాజపా మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. ప్రజాధరణ నాకున్న బలం. జనాలకు అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏ సమస్య వచ్చినా తలుపు తడితే పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా పనిచేసినా భవిష్యత్తులో ఎంపీగా గెలిచినా సాదాసీదాగా అందరిలో కలిసిపోతానని జనాలకు తెలుసు. సుమారు రూ.45కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ నిధులు బాధితులకు అందేలా కృషి చేశాను. ప్రత్యర్థి కిషన్రెడ్డి బలహీనతలూ మా గెలుపునకు కలిసి వస్తాయి. చాలాచోట్ల భాజపా క్యాడర్ మాకే ఓట్లేస్తామని చెబుతున్నారు. భాజపా అభ్యర్థి కిషన్రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు అంటూ వాళ్లే చెబుతున్నారు.
మైనార్టీ ఓటర్ల మనోగతం ఎలా ఉందనుకుంటున్నారు?
సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో ఎలాంటి తుఫాను వచ్చినా ముస్లిం మైనార్టీ ఓటర్లు నా వెంటే ఉంటారు. ఒక వేళ కాంగ్రెస్ అభ్యర్థి దృఢంగా ఉంటే ఓట్లు చీలిపోతాయని తొలుత అనుమానం వ్యక్తం చేశాము. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి మూడోస్థానంలో ఉన్నారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్కి మద్దతుగా నిలిచినట్లు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వారు తటస్థంగానే ఉన్నారనుకుంటున్నాను. ఒకవేళ వారికి మద్దతుగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించినా మా వెంటే ఉంటామని ప్రజలు ముందే చెప్పారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచిన సందర్భాలున్నాయి.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏయే సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు..?
లోక్సభ ఎంపీ అంటే కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాకూడదు. లోక్సభ నియోజకవర్గంతోపాటు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో అంశాలపై దృష్టిపెడతాను. కొన్ని జాతీయ అంశాలు రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై భారాస నుంచి గెలుపొందిన ఎంపీలందరం కలిసి ప్రధాన సమస్యలపై పోరాడతాం. తెలంగాణ గొంతుకగా నిలుస్తాం.
మీ గెలుపునకు దోహదం చేసే అంశాలేంటి? మీ ఎమ్మెల్యేల నుంచి సహకారమెలా ఉంది? మీ బలం, బలహీనతలు ఏంటి..?
జనమే నా బలం.. స్థానిక సమస్యలుంటే ప్రజలే నా దృష్టికి తీసుకొచ్చే స్వేచ్ఛ ఉంది. ఏ సమస్యతో నా కార్యాలయానికి వచ్చినా పరిష్కరిస్తాననే నమ్మకం వారిలో ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో నన్ను గుర్తుపట్టని వారు లేరు. ఇక్కడే పుట్టాను..ఇక్కడే పెరిగాను. వలస వచ్చిన వ్యక్తిని కాదు. ప్రతి వేడుకకు హాజరవుతుంటాను. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా రాష్ట్రమంతా నేనెవరు..? నేనేంటి..? అని అందరికీ తెలుసు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు భారాస వాళ్లే ఉన్నారన్న సంగతి మరిచిపోవద్దు. సికింద్రాబాద్లో నేను ఎమ్మెల్యే. సనత్నగర్ తలసాని శ్రీనివాస్యాదవ్, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ముఠా గోపాల్, అంబర్పేట కాలేరు వెంకటేశ్ ఉన్నారు. వారంతా నా గెలుపు కోసం బాగా సహకరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మా పార్టీలోనే ఉండేవారు కానీ ఈ మధ్యనే కాంగ్రెస్లోకి వెళ్లారు. అభ్యర్థులను ప్రకటించినప్పుడే భారాస విజయం ఖరారైపోయింది. ప్రచారంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు తిరుగుతూ, రోడ్షోలు నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది.
- భాజపా కార్యకర్తలు, మైనార్టీ ఓటర్లు మా వెంటే ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ అసలు మాకు పోటీనే కాదు. ప్రజాదరణ మాకున్న బలం.
- జంటనగరాల్లో నన్ను గుర్తుపట్టనివారు లేరు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ప్రతి వేడుకకు హాజరవుతా. ఎమ్మెల్యేగా ఉన్నా. మంత్రిగా చేసినా ఎంపీగా గెలిచినా అందరితో కలిసిపోతా.
- కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్కి మద్దతుగా నిలిచినట్లు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వారు తటస్థంగానే ఉన్నారనుకుంటున్నా.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
[ 18-05-2024]
క్రికెట్ అభిమానులకు పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఊరట కల్పించింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం రాత్రి హైదరాబాద్- గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రద్దయింది. -
కాపాడకపోతే కష్టమే
[ 18-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ సవాలుగా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్ల కింద మార్చి ఆదాయాన్ని సమకూర్చుకుంది. -
జీహెచ్ఎంసీని ఎలా గట్టెక్కిస్తారు?
[ 18-05-2024]
అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీని ఎలా గట్టెక్కించాలనే అంశమై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. -
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
[ 18-05-2024]
ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. -
మహానగరానికి గోదావరి భరోసా
[ 18-05-2024]
వేసవిలో నగరానికి గోదావరి జలాల భరోసా దక్కింది. వాస్తవానికి మే 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అత్యవసర పంపింగ్తో నగరానికి నీటిని తరలించడానికి జలమండలి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ...ఎల్లంపల్లిలో నీటి మట్టం తగినంత ఉండటంతో ఆ పరిస్థితి రాలేదని అధికారులు చెబుతున్నారు. -
10 నిమిషాలకో బస్సు
[ 18-05-2024]
ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది. -
మెట్రో వేళల పొడిగింపు
[ 18-05-2024]
మెట్రోరైలు వేళల్ని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రతి సోమ, శుక్రవారాలు పొడిగించింది. ఇప్పటి వరకు రాత్రిపూట చివరి మెట్రోరైలు 11 గంటల వరకే ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాలు పొడిగించారు. -
దేవుడా
[ 18-05-2024]
గ్రేటర్ పరిధిలోని కొందరు ఆలయ అధికారుల తీరు ఆడింది ఆట...పాడింది పాటగా మారింది. ఆలయాలకు దాతలు ఇచ్చే విరాళాలు, ఖర్చులపై నిర్ధిష్టమైన లెక్కలు చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వాహనాలు ఇచ్చారు.. మరిచారు
[ 18-05-2024]
మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం 75శాతం రాయితీతో చేపలను రవాణా చేసేందుకు వాహనాలిస్తే.. అధికారుల పర్యవేక్షణలోపంతో కొందరు లబ్ధిదారులు వాటిని సొంత అవసరాలకు వినియో గించుకుంటున్నారు. -
నీటి సంరక్షణకు అడుగులు.. అవార్డుకు బాటలు
[ 18-05-2024]
నీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, చెక్డ్యామ్లు, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి మించిన మార్గం మరొకటి లేదు. కేంద్ర ప్రభుత్వం వీటి తవ్వకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. -
హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం
[ 18-05-2024]
వికారాబాద్ పట్టణం రామయ్యగూడ రోడ్డులోని నాగలక్ష్మి హార్డ్వేర్ దుకాణంలో షార్ట్సర్క్యూట్తో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల ఆస్తి అగ్నికి ఆహుతి కాగా, బీరువాలో దాచి ఉంచిన రూ.10 లక్షల నగదు కాలి బూడిదైందని భవన యజమాని తెలిపారు. -
ఈ‘నామ్కే’వాస్తే!
[ 18-05-2024]
జిల్లాలో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్( ఈనామ్)ఇంకా దేశ వ్యాప్తంగా విస్తరణ జరగలేదు. ఫలితంగా విపణుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. వివిధ రాష్ట్రాల విపణులకు అనుసంధానం జరిగితే, ఉత్పత్తులను వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆన్లైన్లో పోటీ పడి కొనుగోలు చేస్తారు. -
కొలతలు తీసుకోక.. దుస్తులు సరిపోక!
[ 18-05-2024]
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఏటా ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిని కుట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొలతలు తీసుకోకుండానే సరఫరా చేస్తున్నారు. వాటిని ధరిస్తున్న విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. -
లక్ష ప్రయాణికులు లక్ష్యం
[ 18-05-2024]
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్పై మరోసారి చర్చ మొదలైంది. ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన తర్వాత మెట్రోలో 40 వేల మంది ప్రయాణికులు తగ్గారని ఎల్అండ్టీ సంస్థ చెబుతోంది. -
వెంటాడిన కళ్లు
[ 18-05-2024]
భార్య వివాహేతర సంబంధం భర్తను హతమార్చింది. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి వివాహిత దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. హత్య సమయంలో ప్రధాన నిందితుడిని వెంటాడిన బాధితుడి దీనచూపులు లొంగిపోయేందుకు కారణమయ్యాయి. -
ఆన్లైన్ ఆర్డర్లతో హెరాయిన్ రవాణా
[ 18-05-2024]
ఆన్లైన్ ద్వారా హెరాయిన్ సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ నిందితుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి వద్ద రూ.4లక్షల విలువైన 33 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. -
వర్సిటీ ఫీజుల్లో రాయితీ ఇప్పిస్తానని మోసం
[ 18-05-2024]
ఫీజులో రాయితీ ఇప్పిస్తానంటూ రూ.4.39 లక్షలు దండుకున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ (సైబర్ క్రైమ్స్) డి.కవిత వివరాల ప్రకారం.. తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు యూఎస్ఏ ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్లో చదువుతున్నాడు. -
అతివేగానికి ఒకరు బలి
[ 18-05-2024]
మాదాపూర్లో ఓ కారు రెండు ఆటో ట్రాలీలను ఢీకొట్టి ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మాదాపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. మాదాపూర్ మేఘా హిల్స్కు చెందిన మద్దూరు శ్రీనివాస్(35), మణికొండ చిత్రపురి కాలనీవాసి సంకు వీరరాఘవులు పాల వ్యాపారం చేస్తుంటారు. -
చిరునామాల్లో ఉండరు.. దేనికీ స్పందించరు
[ 18-05-2024]
సేవాలోపాలకు పాల్పడుతున్న సంస్థల చిరునామాలపై స్పష్టత కొరవడటంతో లీగల్ నోటీసులు ఎక్కడికి పంపాలన్న ప్రశ్నలు ఫిర్యాదుదారుల్లో తలెత్తుతున్నాయి. జిల్లా వినియోగదారుల కమిషన్లకు ఫిర్యాదులు చేసినా అవి విచారణ వరకు వెళ్లడం లేదు. -
యువతే దేశానికి సంపద
[ 18-05-2024]
యువతే దేశానికి సంపద అని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ అరుణ్కుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విభాగం పట్టభద్రుల దినోత్సవం నిర్వహించారు. -
కొలనుపాక జైన దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్
[ 18-05-2024]
కొలనుపాకలోని జైన శ్వేతాంబర తీర్థం దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్ బాటియా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 30 ఏళ్గుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా, కొన్ని సంవత్సరాలు సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పనిచేశారు. -
కేఏ పాల్పై చీటింగ్ కేసు
[ 18-05-2024]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీకి పార్టీ టికెట్ ఇస్తానని పాల్ రూ.57 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన ఎస్.కిరణ్కుమార్ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. -
రూ.కోటి వజ్రాభరణాలు మాయం
[ 18-05-2024]
శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు క్యాబ్లో ఓ వృద్ధురాలు బయల్దేరగా ఆమెకు సంబంధించిన రూ.కోటి విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. వాటిని క్యాబ్ డ్రైవరే తస్కరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. గత నెల 20న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
‘ఫ్యాషన్ వీక్’ను నిలిపేసిన పోలీసులు
[ 18-05-2024]
ఈనెల 17 నుంచి 19 వరకు లులు మాల్లో కొనసాగాల్సిన ఫ్యాషన్ వీక్ కార్యక్రమాన్ని కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం నిలిపేశారు. -
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
[ 18-05-2024]
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
[ 18-05-2024]
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో